గత ఏడేళ్లుగా తెలుగువారి జీవితాల్లో హాస్యము నకు భాగమైపోయిన జబర్థస్త్ ప్రోగ్రాంలో ఇప్పుడు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి అని అభిమానుల అభిప్రాయము. ఈటీవీ లో కామెడీ ప్రోగ్రాం ఏది అంటే జబర్దస్త్ ప్రోగ్రాము అని చిన్న పిల్లాడు కానిచ్చి చెబుతారు. జబర్దస్త్ షో నుంచి ఒక్కరొక్కరు తప్పుకుంటున్నారు. ఇప్పటికే నాగబాబు షోకు గుడ్ బై చెప్పినట్టుగా ప్రచారం ముమ్మరంగా జరుగుతుండగా యాంకర్ అనసూయ కూడా ఎందుకో తప్పకుందని తెలుస్తోంది.
తెలుగులో మోస్ట్ పాపులర్ అయినా టెలివిజన్ రియాలిటీ షో ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు జబర్థస్త్. టీవీ కామెడీని మరో రేంజ్కు తీసుకెళ్లిన ఈ షో ఎంతో మంది జీవితాలకు లైఫ్ ఇచ్చింది. జబర్థస్త్ స్కిట్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. జబర్దస్త్కు పోటిగా జీ తెలుగులో గ్యాంగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ను ఇటీవల స్టార్ట్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టార్స్ కు సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదలైంది. ఈ కార్యక్రమానికి జడ్జ్గా నాగబాబు, యాంకర్గా అనసూయ వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
అంటే నాగబాబుతో పాటు అనసూయ కూడా జబర్దస్త్ను వదిలేయటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కానీ ఒకేసారి ఇద్దరు మానుకోవడం అర్థం కావడంలేదు జనాలకు.అంతేకాదు ప్రస్తుతం జబర్దస్త్లో స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకుంటున్న హైపర్ ఆది కూడా ఈ షో నుంచి బయటకు వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుస పంచ్లతో జనాలను అలరించే హైపర్ ఆదికి సినిమాల్లోనూ మంచి అవకాశాలు బాగా వస్తున్నాయి. అయితే జబర్దస్త్ నిర్వహకులు సినిమాల్లో నటించేందుకు ఆదికి అనుమతి ఇవ్వటం లేదన్న టాక్ వినిపిస్తోంది.
దీనిని బట్టి మనకు ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోవడానికి కూడా అవకాశం లేకుండా పోతున్నది. ప్రస్తుతం షోలో కొనసాగుతున్న త్వరలోనే ఆది కూడా జబర్దస్త్కు గుడ్బై చెప్పట ఖాయమన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎంతయినా జబర్దస్త్ ప్రోగ్రాం లో ఇన్నాళ్లు జడ్జి గా నటిస్తున్న నాగబాబు, యాంకర్ అనసూయ వేరే ప్రోగ్రాం లో కి వెళ్లి పోవడం బాధాకరమైన విషయం.