టాలీవుడ్ లో చాలా సినిమాలు నటించి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకుని విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది కథానాయిక ఆమని. ఆమె తాజాగా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పలు ఆసక్తికర ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. హీరోయిన్ సౌందర్య గురించి మాట్లాడూతూ.. “నేను, సౌందర్య ఇద్దరం బెంగుళూరులోనే ఉండేవాళ్లం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాము. మా అలవాట్లు, అభిప్రాయాలు.. ఆలోచనలు కలవడంతో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అందువలన మేము ఏదైన ఒకర్ని ఒకరు గౌరవించుకుంటూ ఉండేవాళ్లం” అని చెప్పింది.
ఒకసారి ఒక సినిమా షూటింగ్ టైంలో.. నేను, సౌందర్య ఇద్దరం ఉన్నాము. అక్కడ సౌందర్యతో పాటు వాళ్ల నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి.. సౌందర్య సోదరుడు ’అమర్’ను పెళ్లి చేసుకోమని అడిగారు. ఆయన అలా అడిగే సరికి నాకు ఏం చెప్పాలో అర్దం కాలేదు. నిజం చెప్పాలంటే షాక్ అయ్యాను. ఆ తర్వాత అమర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన కూడా నాతో స్నేహంగా ఉండేవారు. సౌందర్య, అమర్ వంటి మంచి ఫ్రెండ్స్ ను కోల్పోవడం నిజంగా దురదృష్టం. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో సౌందర్య గుర్తొస్తూనే ఉంటుంది’ అని ఆమని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'అమ్మదీవెన'. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవలె విడుదల చేశారు. 'తల్లిగా ఎంత బాధ్యతగా ఉండాలి అనేది ఈ సినిమాలోని కథాంశం. తాగుబోతు మొగుడితో ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు పడుతుంది. ఈ చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూసర్లు వాళ్ళ అమ్మ మీద ప్రేమని సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. దర్శకుడు శివగారు కొన్ని సన్నివేశాలు చాలా సహజంగా తీశారు. 'శుభసంకల్పం' తర్వాత ఈ సినిమాలోనే డీ గ్లామర్ పాత్రలో ఆమె నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా బాగా కుదిరింది.