టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలవైకుంఠపురములో అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలు కూడా రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఈ విధంగా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో తలపడడం వలన థియేటర్స్ విషయంలోనూ అలానే ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయం లోనూ కొద్దిపాటి సమస్యలు తెలెత్తే అవకాశం అయితే ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

 

ఇక కొద్దిరోజులుగా ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య రాజీ చర్చలు జరుగుతున్నాయని, ఆ ప్రకారం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న, అనగా ఒక రోజు ముందు రిలీజ్ కాబోతోందని ఇటీవల వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఈ విషయమై ఇప్పటివరకు సరిలేరు టీమ్ నుండి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇకపోతే నేడు ఈ రెండు సినిమాల విషయమై ఒక సంచలన వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే, సంక్రాంతి కానుకగా ఒకే రోజున ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందున, ఈ ఇద్దరు హీరోలతో కలిసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తమ మూవీస్ ప్రమోషన్ కోసం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొననున్నారని టాక్. 

 

ఈ విషయమై ఇప్పటికే బన్నీతో మాట్లాడగా ఆయన ఒప్పుకున్నారని, ఇక రేపు, లేదా ఎల్లుండి మహేష్ ని కూడా కలిసి ఇంటర్వ్యూ విషయమై మాట్లాడడం జరుగుతుందని అంటున్నారు. కాగా మహేష్ కూడా ఈ విషయమై సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల టాక్. ఇక బన్నీ, మహేష్ ఇద్దరూ కూడా ఎప్పుడూ అవతలి హీరోలను ఎంతో గౌరవించే మనస్తత్వం కలవారు కావడంతో, ఇది సాధ్యపడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో త్రివిక్రమ్ కనుక ఇంటర్వ్యూ నిర్వహిస్తే, అది ఆయా హీరోల ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉండడంతో పాటు, రెండు సినిమాల పబ్లిసిటీకి ఎంతో ఉపయోగపడడం ఖయాం అనే చెప్పాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: