బుల్లితెర మీద కామెడీ సీరియల్ గా వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అమృతం సీరియల్ మళ్లీ రాబోతుంది. యెల్లో మీడియా వర్క్స్ బ్యానర్ లో గుణ్ణం గంగరాజు దర్శక నిర్మాణంలో ఈ సీరియల్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సీరియల్ కు సీక్వల్ రాబోతుందని తెలుస్తుంది. 

 

ఒరేయ్ ఆంజనేలు ఇక ఆయాస పడిపోకు చాలు అంటూ టైటిల్ సాంగ్ తో మొదలయ్యే కామెడీ ఎపిసోడ్ అంతా నవ్వడమే ఆడియెన్స్ పనిగా ఉండేది. ఇప్పుడంటే అడల్ట్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప అప్పట్లో ఈ ఆరోగ్యకరమైన కామెడీ చూసి ప్రేక్షకులు భలే ఆస్వాధించారు. శివాజి రాజా, హర్షవర్ధన్, గుండు హనుమంతురావు, వాసు ఇంటూరి, రాగిణి, శివన్నారాయణ ఇలా అందరు తమ పాత్రలతో మెప్పించారు.

 

అమృతం, అంజి, అప్పాజి, సర్వం పాత్రలో వీరు పండించిన కామెడీ ఇప్పటికి గుర్తుంటుంది. మొన్నామధ్య గంగరాజు ఈ కాన్సెప్ట్ మీద సినిమా కూడా చేశాడు కాని అది వర్క్ అవుట్ అవలేదు. ఇక ఇప్పుడు మళ్లీ గుణ్ణం గంగరాజు 18 ఏళ్ల తర్వాత అమృతం సీరియల్ పార్ట్ 2 రాబోతుంది. కచ్చితంగా ఈ సీరియల్ ఇదివరకు కన్నా ఎక్కువ ఎంటర్టైమెంట్ ఇస్తుందని చెప్పొచ్చు.

 

అమృతం సీరియల్ కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. టెక్నాలజీ అంత అప్డేట్ అవని ఆరోజుల్లోనే ఈ సీరియల్ అంత హిట్ అయ్యింది అంటే ఇక ఇప్పుడు కచ్చితంగా అదో లాఫింగ్ థెరపీగా పనిచేస్తుంది. కచ్చితంగా ఈ సీరియల్ మళ్లీ సూపర్ హిట్ అవడం ఖాయమని చెప్పొచ్చు. అమృతం పార్ట్ 2లో ఎవరు ఉంటారు గుండు హనుమంతురావు పాత్రలో ఎవరు నటిస్తారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తవగా త్వరలోనే ఈ సీరియల్ మొదలవుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు టివి సీరియల్ లా కాకుండా వెబ్ సీరీస్ లా ఇది ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: