ప్రస్తుతం మహేష్ మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగానే అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ ప్రక్కన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి గారు చాలారోజుల తరువాత తెలుగు సినిమా పరిశ్రమలోకి మళ్ళి రీఎంట్రీ ఇస్తుండడంతో ఆమెను చూడాలని ఆమె ఫ్యాన్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయశాంతితో పాటు మరొక సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తోంది. అయితే ఆమె మరెవరో కాదు ఆమని. నిజానికి మరొక నటి అయిన సంగీత, ఈ సినిమా ద్వారా చాలా రోజుల తరువాత సినిమాల్లోకి కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు మరియు ఫోటోలు బయటకు రాగా, ఎక్కడా కూడా ఆమనికి సంబందించిన న్యూస్ కానీ లేదా ఫొటోస్ కానీ బయటకు రాలేదు. 

 

అయితే నేడు ఒక ఫంక్షన్ సందర్భంగా మీడియాతో సరదాగా మాట్లాడిన ఆమని, ప్రస్తుతం మహేష్ గారి సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నానని చెప్పడం జరిగింది. అంతేకాక సినిమాలో విజయశాంతి గారి రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, తప్పకుండా ఆమెకు ఈ సినిమా మంచి కంబ్యాక్ మూవీ గా మంచి పేరును తీసుకురావడం ఖాయమని ఆమని చెప్పడం జరిగిందట. ఇక ఈ సినిమా తనకు కూడా మంచి పేరు తీసుకువస్తుందని ఆమె భావిస్తున్నట్లు తెలిపిందట. ప్రకాష్ రాజ్, శ్రీనివాస రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హరితేజ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: