ఈటివి కామెడీ షో జబర్దస్త్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గురు, శుక్రవారాలు రాత్రి తొమ్మిదిన్నర అయ్యిందంటే చాలు టివిలకు అతుక్కుపోతావు కామెడీ లవర్స్. అడల్ట్ కామెడీ అన్నా.. రోత పుట్టించే కామెడీ అని విమర్శించినా జబర్దస్త్ షోని కొట్టే షో ఐదారేళ్లలో ఏది రాలేదని చెప్పాలి. ఈటివికి మంచి టి.ఆర్.పి రేటింగులు తెచ్చిన ఈ షో మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ నుండి వస్తుందని తెలిసిందే.

 

బుల్లితెర ఆడియెన్స్ కు బాగా అలవాటైన కామెడీ షో జబర్దస్త్. ఈటివి తరహాలో మిగతా ఛానెల్స్ ఇలాంటి షోలు ప్లాన్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే లేటెస్ట్ గా జబరస్త్ డైరక్టర్ నిఖిల్ బయటకు రావడంతో జబర్దస్త్ లాంటి మరో షో జీ తెలుగులో స్టార్ట్ చేస్తున్నారట మల్లెమాల టీం తో రెమ్యునరేషన్ గొడవల వల్ల జబర్దస్త్ నుండి డైరక్టర్ నిఖిల్ బయటకు వచ్చాడట.

 

జీ తెలుగు వారు క్రేజీ ఆఫర్ ఇవ్వడంతో నిఖిల్ అక్కడ ఓ క్రేజీ రియాలిటీ షో ప్రాభిస్తున్నాడు. నిఖిల్ కు సపోర్ట్ చేస్తూ మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ షోకి జడ్జ్ గా ఉంటారని తెలుస్తుంది. అంతేకాదు అనసూయ, సుడిగాలి సుధీర్ అండ్ టీం, హైపర్ ఆది లాంటి వారు కూడా జీ తెలుగు కొత్త కామెడీ షో గ్యాంగ్ స్టర్స్ కు జంప్ అవుతున్నారట. సో జబర్దస్త్ కాస్త ఇప్పుడు గ్యాంగ్ స్టర్ కాబోతుందన్నమాట.

 

ఇప్పటికే ఈ షో ప్రోమో కోసం జబర్దస్త్ మొదట్లో కామెడీ చేసిన వేణు, ధన్ రాజ్ లతో ఫస్ట్ ఎపిసోడ్ చేసినట్టు ఉన్నారు. జబర్దస్త్ టీం.. జబ్ర్దస్త్ కాన్సెప్ట్ కాబట్టి కచ్చితంగా ఈ గ్యాంగ్ స్టర్స్ కూడా క్లిక్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే జబర్దస్త్ లో ఉన్న మిగతా కమెడియన్స్ మాత్రం అగ్రిమెంట్ చేసి ఉన్న కారణంగా అందులోనే ఉండాల్సి వస్తుందట. ఇక అనసూయ బదులుగా జబర్దస్త్ యాంకర్ గా శ్రీముఖి కనిపిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: