దశాబ్ధ కాలం పైగా హీరోయిన్ గా సౌత్ లో కెరియర్ సాగిస్తున్న క్రేజీ బ్యూటీ కాజల్ అంటే తెలుగు, తమిళ భాషల్లో ఓ ఇమేజ్ ఉంది. లక్ష్మి కళ్యాణం నుండి ఈమధ్య వచ్చిన సీత సినిమా వరకు కాజల్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చింది. హీరోయిన్ గా ఎంతోమంది వచ్చి వెళ్తున్నా కాజల్ మాత్రం కొన్నాళ్లుగా ఇక్కడే తిష్ట వేసింది.

 

అయితే అలాంటి కాజల్ తన కెరియర్ లో మొదటిసారి స్పెషల్ ఐటం సాంగ్ చేసింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ అంటూ దుమ్ము దులిపేసింది కాజల్. అయితే ఈ సాంగ్ సినిమాకు ఎంత పెద్ద హెల్ప్ అయ్యిందో అందరికి తెలుసు. మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసిన కాజల్ ఆ సాంగ్ లో రెచ్చిపోయింది.

 

ఇక ఆ సాంగ్ రిఫరెన్స్ తో కాజల్ కు మళ్లీ మళ్లీ అలాంటి ఆఫర్లు వచ్చినా అదేదో ఎన్.టి.ఆర్ కోసం చేశానని తప్పించుకుంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కాజల్ తో ఐటం సాంగ్ కావాల్సిందే అని పట్టుబడుతున్నాడట. ఆర్య 2లో కాజల్ తో నటించాడు అల్లు అర్జున్. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో చేస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో కాజల్ తో ఓ సాంగ్ పెట్టించాలని ప్రయంతిస్తున్నాడు బన్ని.

 

కాజల్ చేయనని చెబుతున్నా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి టెంప్ట్ చేస్తున్నారట. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో కాజల్ ఐటం సాంగ్ కూడా ఉంటే ఇక ఆ లెక్క వేరేలా ఉంటుంది. మరి కాజల్ ఈ స్పెషల్ సాంగ్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో పూజాతో బన్ని రొమాన్స్ కూడా అదరగొడుతుందని అంటున్నారు. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ లో రెండు సూపర్ హిట్ అయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: