జీవన్రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. ‘దళం’ ఫేమ్ ఆయన దర్శకత్వంలో అప్పిరెడ్డి, దామోదర్రెడ్డి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అప్పిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ–‘‘నేను అమెరికాలో ఉన్నప్పుడే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నాను.
ఇక్కడ మా మైక్ టీవీకి బ్రాండింగ్ ఉండటంతో మైక్ మూవీస్ అనే బ్యానర్ను స్థాపించి మంచి సినిమాలు చేయాలనుకున్నాను. జార్జిరెడ్డి కథ వినగానే నాకు చాల నచ్చింది, జార్జిరెడ్డి కథ నాకు ఒక మంచి ఇన్స్పైరింగ్గా అనిపించింది. సబ్జెక్ట్ నచ్చడంతో బడ్జెట్ గురించి అస్సలు ఆలోచించలేదు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ సెట్ను మల్లి వేశాం. ఈ యూనివర్సిటీ సెట్ ఇవ్వని అప్పటి రోజులన్ని బాగా గుర్తుచేస్తున్నాయి.
అలాగే చిరంజీవిగారు మా సినిమా తప్పకుండా చూస్తాను అని చెప్పారు’’ అన్నారు. ‘‘జార్జిరెడ్డి కథ కచ్చితంగా నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఈ కథకు స్టార్ హీరోలు అవసరం లేదు.ఇందులో జార్జిరెడ్డి క్యారెక్టరే హీరో. జార్జిరెడ్డి పాత్రలో మనం హుహించని ఎన్నో క్యారెక్టర్స్ వున్నాయి .
ఆయనలో హీరోకు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఆయన ఈ చిత్రంలో ఒక బాక్సర్, ఫైటర్. ఓ సందర్భంలో జార్జిరెడ్డిపై ఓ కూడా డాక్యుమెంటరీ తీశాం. అప్పుడే నాకు జార్జిరెడ్డి పైన ఒక సినిమా చేద్దామనే ఆలోచన కలిగింది. ఈ సినిమా జీవన్రెడ్డి కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఈ చిత్రం లో ఆ ఒక్క పాత్రకూడా తక్కువ చెయ్యలేదు , జార్జిరెడ్డి క్యారెక్టర్ను హైలైట్ చేయాలని కూడా ఎవ్వరిని తక్కువగా చూపించలేదు. ప్రమోషన్స్, బిజినెస్, పబ్లిసిటీ మాకు కొత్త. సంజీవ్రెడ్డిగారు మాతో కలవడం మాకు ప్లస్’’ అన్నారు. ‘‘కొత్త కథలను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది. మా సినిమాకు మోరల్ సపోర్ట్గా చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుగార్లు నిలిచారు’’ అన్నారు సంజయ్రెడ్డి.