ఇప్పటికీ కూడా కొన్నేళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో మంచి క్రేజ్ మరియు రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. మొదట ఇటువంటి కామెడీ షోలు ఎంతవరకు నిలుస్తాయి అని మాట్లాడిన వారే, నేడు ముక్కున వేలు వేసుకునే రేంజ్ కి జబర్దస్త్ చేరుకుంది. అంతేకాక ఒకానొక సమయంలో రేటింగ్స్ పరంగా కొంత సతమతం అయిన ఆ ఛానల్ కు జబర్దస్త్ వల్లనే పూర్వ వైభవం వచ్చిందని చెప్పవచ్చు. ఇక మొదట్లో ఈ షోకి చిన్న పార్టిసిపెంట్స్ గా వచ్చిన ఎందరో నటులు ప్రస్తుతం ఎవరికి వారు ప్రత్యేకంగా టీమ్ లు ఏర్పాటు చేసుకుని సక్సెఫుల్ గా షో ను ముందుకు తీసుకెళ్తున్నారు. 

 

ఇక మొదటి నుండి కూడా ఈ షోకు మెగా బ్రదర్ నాగబాబుతో పాటు నటి మరియు ఎమ్యెల్యే అయిన రోజా జడ్జీలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఉన్నట్లుండి హఠాత్తుగా జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వెళ్లి మరొక ఛానల్ లోని షోకు జడ్జిగా వ్యవహరిస్తుండడంతో, ఆయన పై పలు పుకార్లు కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్నాయి. జబర్దస్త్ నిర్వాహకులతో నాగబాబుకు పెద్ద వివాదం జరిగిందని, దానికి ఆయన నొచ్చుకోవడంతోనే షో నుండి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. కాగా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, చమ్మక్ నేడు చంద్ర అసలు విషయాన్ని ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ చెప్పాడు. నిజానికి నాగబాబు గారు జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి ఎటువంటి కారణం లేదని, కాకపోతే వేరే ఛానల్ లో ఆఫర్ రావడంతోనే కాదనలేక అటు వెళ్లారని, 

 

ఈ విషయమై జబర్దస్త్ షో నిర్వాహకులతో ఎటువంటి వాదన జరుగలేదని అన్నారు. ఇక తాను సహా మరికొందరు జబర్దస్త్ టీమ్ మెంబెర్స్ కూడా షో నుండి బయటకు రావడానికి గల ముఖ్య కారణం కొంత రిలీఫ్ కోసం మాత్రమే నని, కొన్ని నెలల తరువాత మేము అందరమూ మళ్ళి షోకి తిరిగి వెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు చమ్మక్ చంద్ర. అయితే ఒకరకంగా నాగబాబు లేని జబర్దస్త్ షో ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: