అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అల వైకుంఠపురములో. అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. 2020 జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల కాగా విడుదలైన రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. 
 
అల వైకుంఠపురములో థియేట్రికల్ రైట్స్ దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయి. హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ 19.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అల వైకుంఠపురములో సినిమాకు అల్లు అర్జున్ 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. బన్నీ సినీ కెరీర్లో ఇప్పటివరకు తీసుకున్న రెమ్యూనరేషన్ లలో ఇదే హైయెస్ట్ కావటం గమనార్హం. 
 
సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాకు దాదాపు 120 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్లతో సినిమా తీస్తే 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతూ ఉండటం గమనార్హం. 
 
మరోవైపు ఈ సినిమాకు పోటీగా మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా జనవరి 12వ తేదీనే విడుదల కాబోతుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల రిలీజ్ డేట్స్ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మహేశ్ బాబుకు జోడీగా రష్మిక మందన్నా సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: