సందీప్ కిషన్ హీరోగా హన్సిక హీరోయిన్ గా జి నాగేశ్వర్ రెడ్ది దర్శకత్వంలో వచ్చిన చిత్రం "తెనాలి రామక్రిష్ణ. ఈ సినిమా మీద సందీప్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. నిను వీడని నీడని నేనే లాంటి హారర తర్వాత విభిన్నంగా కామేడీ జానర్ లో వచ్చిన చిత్రం ప్రేక్షకులను మెప్పించకలేకపోయిందనే చెప్పాలి. ఈ సినిమాకి రివ్యూల పరంగా చాలా నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి విమర్శకులపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.

 

సినిమాలో కామెడీ అనుకున్నంతగా పండలేదన్నది చాలా మంది విమర్శకుల అభిప్రాయం. అయితే ఈ విషయం అటుంచితే సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా రావట్లేదని సమాచారం. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి, హీరో సందీప్ కిషన్ లు సినిమా ప్రేక్షకులకి చాలా నచ్చిందని, సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటున్నారని, తాను థియేటర్ లోకి వెళ్ళి చూస్తున్నామని చెప్తున్నాడు. అయితే సినిమా బాగుందంటున్నా మరి కలెక్షన్లు ఎందుకు రావట్లేదనేది పెద్ద ప్రశ్నగా మారింది.

 

ఈ నేపథ్యంలో సందీప్ కిషన్  తన ఆవేదనను బయటపెట్టాడు. సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ క్రిటిక్స్ పేరెత్తకుండా సినిమా గురించి ఎక్కువ నెగెటివ్‌గా రాసి డ్యామేజ్ చేశార‌న్న అభిప్రాయం సందీప్ మాట‌ల్లో  స్పష్టంగా అర్థమైంది. కొన్ని రోజులు గ‌డిచాక సినిమా రిజ‌ల్ట్ గురించి ఓపెన్‌గా మాట్లాడ‌దామ‌ని ఆగాన‌ని సందీప్ చెప్పాడు.  నెగెటివ్ రివ్యూల వల్లే సినిమాకి ప్రేక్షకులు రావట్లేదని, రివ్యూ రాసేవాళ్ళు కొంత సమయం తీసుకుని తమ రివ్యూ ఇస్తే బాగుండేదని తన మాటల ద్వారా తెలిసింది.

 

వరుస వైఫల్యాల తర్వాత మంచి కామేడీతో వచ్చిన ఈ సినిమాకు అనుకున్న‌ట్లుగా వ‌సూళ్లు రాక‌పోవ‌డం నిరాశ క‌లిగిస్తోంద‌న్న సందీప్.. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూస్తే క‌చ్చితంగా బాగా న‌వ్వుకుంటార‌ని ప్రేక్ష‌కుల్ని ఉద్దేశించి చెప్పాడు.మరి ఈ మాటల తర్వాతైనా ప్రేక్షకులు పెరుగుతారెమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: