ఇండస్ట్రీలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే శ్రీరెడ్డి తనదైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటుంది. ‘కారెవరూ శ్రీరెడ్డికి అనర్హం..’ అన్న చందాన తన వరకూ వస్తే ఎంతటి వారిపైనైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. నాని నుంచి చిరంజీవి వరకూ ఎవరినీ వదలని శ్రీరెడ్డి ఎప్పుడు ఏ సంచలన వార్త బయటపెడుతుందోనని కొందరిలో ఆందోళన కూడా ఉంటుంది. అటువంటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఓ వార్తతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇటివల సురేశ్ బాబు, నాని ఆఫీసులపై జరిగిన ఐటీ దాడులే అమ్మడి ఆనందానికి కారణం.

 

 

ఐటీ శాఖ ఇటివల టాలీవుడ్ దిగ్గజం సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ ప్రొడక్షన్ కార్యాలయాలు, రామానాయుడు స్టూడియోలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్విహించిన సంగతి తెలిసిందే. సురేశ్ తో పాటు న్యాచురల్ స్టార్ నాని ఆఫిసుపై కూడా దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ కు ఒక్కసారిగా షాక్ తగిలి మరెవరిపై దాడులు జరుగుతాయోనని ఆందోళనలో ఉన్నారు. కానీ.. ఈ రైడ్స్ జరగడంపై మాత్రం శ్రీరెడ్డి ఆనందంతో పొంగిపోతోంది. ‘కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి థ్యాంక్స్.. దేవుడు ఉన్నాడు సురేశ్ బాబు గారు, నానీ కర్మ ఈజ్ బ్యాక్’ అంటూ తన ఫేస్ బుక్ లో పోస్టులు చేసింది. ఈ సంఘటనలతో శ్రీరెడ్డి సంబరాలు చేసుకుంటోందని తెలుస్తోంది.

 

 

సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ తో తన అటాచ్ మెంట్ గురించి ఒక్కసారిగా ఫోటోస్ తో సహా రివీల్ చేసి సంచలనం సృష్టించింది. తనను మోసం చేశారంటూ ఫిల్మ్ నగర్ ఆఫీస్ వద్ద తాను చేసిన ధర్నా కూడా ఎంతో సంచలనమైంది. హీరో నానిపై కూడా పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె శత్రువులుగా భావించే ఇద్దరిపై ఒకేసారి ఐటీ రైడ్స్ జరగడం ఆమె సంతోషానికి కారణమైందనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: