యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ, .. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత సీ క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రూల‌ర్ టైటిల్‌తో తెర‌కెక్కే ఈ సినిమా ఇప్ప‌టికే సంక్రాంతి కానుక‌గా డిసెంబ‌ర్ 20న రిలీజ్ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు. 

 

సినిమా అయిన వెంట‌నే బాల‌య్య బోయ‌పాటి సినిమాకి రెడీ అవుతున్నారు. బాలయ్య, బోయపాటి కలయికలో ముచ్చ‌టగా మూడో సినిమా రాబోతుంది. అయితే ఇప్పుడీ సినిమాకి సంబధించిన తాజా సమాచారం ఏమిటంటే.. ఇదో ఫ్యామిలీ డ్రామా. అంటే.. కంప్లీట్ ఫ్యామిలీ అని కాదు.. బోయపాటి మార్క్ తో సాగే ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న క‌న్న‌డ హీరోయిన్ రుచితా రామ్ ఎంపికైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

 

ఇక బోయ‌పాటి - బాల‌య్య కాంబోలో ఇప్ప‌టికే సింహా, లెజెండ్ సినిమ‌లు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ప‌ర‌పంర‌లో వ‌స్తోన్న మూడో సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ ఇవ్వాల‌ని బోయ‌పాటి క‌సితో ఉన్నాడు. సింహా, లెజెండ్ సినిమాల్లో పొలిటికల్ టచ్ వుంది. కానీ ఇందులో కంప్లీట్ గా పాలిటిక్స్ ని ఎవైడ్ చేస్తున్నారని టాక్. కేవ‌లం ఎమోష‌న్స్‌, ఫ్యామిలీ క‌థాంశంతోనే ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. 

 

దీనికి టైటిల్ కూడ సింహా, లెజెండ్ లా హెవీగా కాకుండ కొంచెం సాఫ్ట్ గా వుండే పేరునే పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇక బోయ‌పాటి విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ కావ‌డంతో ఈ సినిమా కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు టాక్‌. ఇక బాల‌య్య కూడా రెండు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల‌తో రెండు ఘ‌క్ష‌ర‌మైన ప్లాప్‌లు ఇచ్చాడు. మ‌రి ఈ సినిమాతో అయినా వీరిద్ద‌రు హిట్ హ్యాట్రిక్ ఇస్తారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: