గత కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్యం క్షీణించిందని... ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు... తన ఆరోగ్యం విషమించ లేదని కేవలం జ్వరం  మాత్రమే వచ్చిందని తెలిపారు ... జ్వరం జలుబు దగ్గు కోసం మాత్రలు తీసుకునేందుకు హాస్పిటల్ కి వెళ్తే ఆరోగ్యం విషమించింది పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వార్తలు వచ్చాయని కృష్ణంరాజు తెలిపారు. ఈ వార్తను చూసిన తన అభిమానులు కంగారు పడిపోయి తన ఆరోగ్యం ఎలా ఉందొ  అంటూ అభిమానులు ఆరా తీశారని కృష్ణంరాజు తెలిపారు. అయితే ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కాస్త వెనక ముందు ఆలోచించుకోవాలని... తనను కానీ ఇంట్లో వాళ్లని సంప్రదించి ఇలాంటి వార్తలు రాస్తే బాగుంటుంది   కృష్ణంరాజు సలహా ఇచ్చిన విషయం తెలిసిందే

 

 

 అంతేకాకుండా తన ఎదుగుదలలో  మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని... మీడియా పాత్ర  మరువలేనిది అంటూ కృష్ణంరాజు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న  ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు . అయితే తాజాగా కేంద్ర మాజీ మంత్రి నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తన ఆరోగ్యంపై మరోసారి స్పందించారు. తను కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నానని... జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అంటూ ఆయన తెలిపారు. కాగా నిన్న తమ పెళ్లి రోజు సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి బంజారాహిల్స్ లోని విజయ గణపతి స్వామి దేవాలయంలో శత చండీ మహాయాగం లో పాల్గొన్నారు. కృష్ణంరాజు ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానులు కూడా రెబల్ స్టార్ కృష్ణంరాజు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

 

 

 

 రెబల్ స్టార్ కృష్ణంరాజు అప్పట్లో టాప్ హీరో గా కొనసాగే రెబల్ స్టార్ గా ఎదిగారు . అప్పటి హీరోలందరి లో కృష్ణంరాజు హీరోయిజం  కాస్త సపరేట్ గా  ఉండేది. అప్పట్లో కృష్ణంరాజు కత్తి అందుకో జానకి నాయాల్ది  అనే డైలాగ్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో నోట్లో  నానుతూనే ఉంది. కాగా కృష్ణ వారసుడిగా  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ సంపాదించారు ప్రభాస్. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్  ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరల్డ్ వైడ్  డార్లింగ్ గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: