సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల విష‌యంలో ఇండ‌స్ట్రీలో కొద్ది రోజులుగా పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది. ముఖ్యంగా మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు, అల్లు అర్జున్ అల వైకుంఠ‌పురంలో రెండు సినిమాలు పోటాపోటీగా జ‌న‌వ‌రి 12నే డేట్లు లాక్ చేసుకున్నాయి. ఇక సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్ సైతం సంక్రాంతికే వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు టాప్ హీరోల సినిమాల మ‌ధ్య రాజీ కుద‌ర‌డంతో సంక్రాంతి సినిమాల డేట్లు ఫైన‌ల్‌గా లాక్ అయ్యాయ‌ని తెలుస్తోంది.

 

రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ మూవీ విడుదల తేదీ కూడా మారడంతో కాస్త రిలీజ్ డేట్ల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. తాజా పరిణామాలతో సంక్రాంతి సినిమాలు ఫిక్స్ అయ్యాయి, థియేటర్లు లాక్ అయ్యాయి, విడుదల తేదీలు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. ముందు అంచ‌నాల ప్ర‌కారం జనవరి 10 లేదా 11న రిలీజ్ అవ్వాలి దర్బార్ సినిమా. కానీ అలా చేస్తే మహేష్, బన్నీ సినిమాలతో పోటీ వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాను 9వ తేదీకి మార్చారు.

 

9న ద‌ర్బార్ వ‌స్తే 9, 10, 11 డేట్ల‌తో ద‌ర్బార్‌కు మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయి. ఇక స‌రిలేరు, అల వైకుంఠ‌పురంలో రెండూ ముందుగా 12న రావాలి. అయితే ఇప్పుడు  దిల్ రాజుతో పాటు మరికొందరు సినీపెద్దలు కూర్చొని సయోధ్య కుదిర్చారు. అలా మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు జనవరి 11న థియేటర్లలోకి వస్తుంది. జనవరి 12న బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురం సినిమా రిలీజ్ అవుతుంది.

 

ఇక నంద‌మూరి హీరో కల్యాణ్ రామ్. అతడు నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాను జనవరి 15న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. శ‌త‌మానం భ‌వ‌తి లాంటి ఫ్యామిలీ స్టోరీని డైరెక్ట్ చేసిన స‌తీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై క‌ళ్యాణ్ రామ్ మంచి న‌మ్మ‌కంతో ఉన్నాడు. సో సంక్రాంతి సినిమాల డేట్లు ఫిక్స్ అయ్యాయి. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యుద్ధ‌మే మిగిలి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: