నయనతార హవా కొనసాగుతోందనడానికి మరో ఉదాహరణ ఇది. తెలుగు ఇండస్ట్రీలో సైరా, తమిళంలో బిగిల్‌ విజయాలతో కొత అవకాశాలు బాగా వస్తున్నాయి నయనతారకి. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్‌ పెంచిందని వార్తలు వినిపిసిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలకు ఐదు కోట్ల వరకు పారితోషకం పుచ్చుకున్నట్లు  వార్తలు వస్తున్నాయి. ఇక  రెమ్యునరేషన్‌ తాజాగా 8కి పెంచేసినట్లు వార్తలు వినిపిసిస్తున్నాయి. 


నయనతారకు ఉన్న క్రేజ్‌తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఇలా తమ సినిమాల్లో నటించమని అడిగిన ప్రొడ్యూసర్లపై నయనతార భారీ పారితోషకమనే బిగ్‌ బాంబ్‌ వేసినట్లు కనిపిస్తుంది. అయితే భారీగా పారితోషకం పెంచినప్పటికీ తమ సినిమాలో నయనతారే నటించాలని కొంతమంది దర్శక నిర్మాతలు బాగా తిష్ట వేశారట. ఎందుకంటే నయనతారకు ఉన్న క్రేజ్‌ అటువంటిది అని సమాచారం.  

 


ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటిస్తున్న దర్బార్‌ చిత్రాన్ని పూర్తి చేసిన నయనతార ప్రస్తుతం తన ప్రియుడు, దర్శకుడు విఘ్నశ్‌ శివన్‌ను నిర్మాతగా చేసి నెట్రికన్‌ అనే చిత్రంలో హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. తాజాగా మరో చిత్రానికి కూడా సరే చెప్పినట్లు సమాచారం. ఆర్‌జే.బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ముక్కుత్తి అమ్మన్‌ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉంది నయనతార. ఇది భక్తిరస కథా చిత్రంగా ఉంటుందని ఆర్‌కే.బాలాజీ ఇటీవల తెలియచేయడం జరిగింది. 

 

 

మరో విషయం ఏమిటంటే ఇందులో నయనతార అవకాశం అడిగి మరీ సరే చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆర్‌జే.బాలాజీనే స్వయంగా తెలియజేయడం జరిగింది. బాలాజీ కథను రెడీ చేసుకుని కొందరు సినీ ప్రముఖులకు కూడా తెలిపారు ఇప్పటికే. అందులో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కూడా ఉన్నాడట. ఆయన ఈ కథ గురించి నయనతారకు చెప్పడంతో ఆమె వెంటనే ఆర్‌జే.బాలాజీకి ఫోన్‌ చేసి ఏమిటీ ఎవరెవరికో కథ వినిపిస్తున్నావట. నాకు చెప్పవా? అని అడిగారని బాలాజీ పేర్కొన్నారు. తాజాగా అలా కథను చెప్పించుకుని మరీ అవకాశాన్ని పొందిన నయనతార ఈ చిత్రానికి 8 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందనేది  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది ఈ టాపిక్ ఇప్పుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: