టాలీవుడ్లో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతాఇంతా కాదు.. ఎలాంటి రచ్చ చేసిందో చెప్పక్కర్లేదు.  టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్  ఉందని, క్యాస్టింగ్ కౌచ్ కారణంగా అనేక మంది మహిళలు బలి అవుతున్నారని, అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకొని వదిలేస్తున్నారని శ్రీరెడ్డి విమర్శలు చేసింది.  రోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చొని పోరాటం చేసింది.  క్యాస్టింగ్ కౌచ్ వాదనలు మరింత ఎక్కువ కావడంతో.. శ్రీ రెడ్డి టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్ళింది.  


హైదరాబాద్ లో ఉండగానే శ్రీరెడ్డి పవన్ పై విమర్శలు చేసింది.  పవన్ పై చేసిన వ్యాఖ్యలను అయన అభిమానులు ఎంతగా రియాక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు.  పవన్ పై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఏకంగా ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి దీనిని ఖండించారు.  పవన్ తో పాటుగా నాగబాబు, అల్లు అర్జున్ తదితరులు అంతా ప్రెస్ మీట్ కు హాజరై ఆమె వ్యాఖ్యలను ఖండించారు.  

 

పవన్ కళ్యాణ్ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తన మసులోని కొన్ని మాటలను కూడా బయటపెట్టింది.  పవన్ కళ్యాణ్‌తో కలిసి బాలీ, కొడైకెనాల్, కేరళ లాంటి ప్రాంతాల్లో బోటు షికారుకు వెళ్లాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టింది శ్రీరెడ్డి.  బాలికి వెళ్తే పవన్ కళ్యాణ్ తో మాత్రమే వెళ్తానని చెప్పింది.  అయితే, పవన్ కళ్యాణ్ తో బాలికి ఎందుకు అంటే.. డేటింగ్ కోసం కాదని, తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే పవన్ తో కలిసి బాలికి వెళ్లాలని ఉందని చెప్పింది శ్రీరెడ్డి.  


పవన్ కళ్యాణ్ తో శాశ్వత శత్రుత్వం ఏమి లేదని, పవన్ లో అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయని కూడా అనుకోవడం లేదని, పవన్ మారిపోయి అనుభవం ఉన్న మంచి నాయకుడిగా మారిపోతే.. పవన్ కళ్యాణ్ కు తప్పకుండా సహకరిస్తా అని చెప్పింది శ్రీరెడ్డి.  సహకరించడమే కాకుండా, జనసేన పార్టీలో కూడా జాయిన్ అవుతానని, జనసేన పార్టీలో పవన్ తో కలిసి పనిచేస్తా అని చెప్తోంది.  మరో శ్రీరెడ్డి కోరికను పవన్ తీరుస్తారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: