తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద హీరోల‌కు, ద‌ర్శ‌కుల‌కు ఉండే విలువే వేరు అది ఏవిష‌యంలో నైనా స‌రే. వాళ్ళ‌కిచ్చే గౌర‌వం కావొచ్చు, రెమ్యూన‌రేష‌న్స్ కావొచ్చు. ఈ మ‌ధ్య చాలా మంది హీరోలు స్టార్ స్టేట‌స్‌లో ఉన్నారు. అలాగే ద‌ర్శ‌కులు కూడా అదే సంఖ్య‌లో ఉన్నారు. ఒక పెద్ద సినిమాకి అయ్యే బ‌డ్జెట్ 100-150 కోట్లు అనుకుంటే దాన్ని మూడు వాటాలుగా చూసినా అందులో మూడో వంతు కేవ‌లం హీరో, ద‌ర్శ‌కుడి ఖాతాలోకే వెళ‌తాయి. హీరోని చూసే టిక్కెట్టు తెగుతుంది.. అలాగే స్టార్ డైరెక్టర్ రేంజును బట్టి కూడా జనం థియేటర్లకు వస్తున్నారు. అందుకే ఆ ఇద్దరిదే మెజారిటీ షేర్ గా మారింది. డిమాండ్ సప్లయ్ సూత్రం ఆధారంగా అంత పెద్ద మొత్తాల్ని చెల్లించేందుకు నిర్మాతలు ముందుకు వస్తుండడంతో ఈ ఆట అలా సాఫీగానే సాగిపోతోంది. అయితే చివర్లో సినిమా తేడా కొట్టిందంటే నిర్మాత అనేవాడు విల‌విల‌లాడిపోతాడు. 

 

అదంతా అలా ఉంటే సంక్రాంతి బరిలో దిగుతున్న భారీ సినిమాలకు హీరో- దర్శకుడు ఏక మొత్తంగా పుచ్చుకునే పారితోషికాలు షాకిస్తున్నాయన్న నివేదిక తాజాగా అందిన స‌మాచారం. బన్ని-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వ‌స్తున్న చిత్రం అల వైకుంఠపురం.. మహేష్- అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వ‌చ్చే చిత్రం `సరిలేరు నీకెవ్వరు` ఈ రెండు చిత్రాల హీరోలు ద‌ర్శ‌కులు అందుకే పారితోషికం కాస్త ఎక్కువే.  మహేష్ విషయంలో  పారితోషికం ప్లస్ లాభాల్లో వాటాలు ఏరియా హక్కులు అంటూ లెక్కలు చెబుతోంటే.. 100శాతం సక్సెస్ రేటు ఉన్న ట్యాలెంటెడ్ అనీల్ రావిపూడికి దాదాపు 10-12 కోట్ల మేర చెల్లిస్తున్నారన్న ప్రచారం  ఉంది. దీంతో బడ్జెట్లో మూడో వంతు సుమారుగా ఆ ఇద్దరి ఖాతాలోకే పడిపోతుందని విశ్లేషిస్తున్నారు.

 

ఇక ఇదిలా ఉంటే.. అల వైకుంఠపురములో చిత్రానికి హీరో-దర్శకులకు భారీగానే ప్యాకేజ్ ముడుతోందట. బన్నికి రూ.20 నుంచి 25 కోట్ల మేర పారితోషికం అందుతుండగా.. త్రివిక్రమ్ క‌నీసం రూ.20 కోట్ల వరకైనా తీసుకోడా అని కొంద‌రు అంటున్నారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడో వంతు అంటే సుమారు 45-50 కోట్లు ఆ ఇద్దరి పారితోషికాలకే వెళ్లిపోతోందని చెబుతున్నారు. ఇక మిగిలినది ఇతర బడ్జెట్ కింద లెక్క. ఇటీవల నాన్ థియేట్రికల్ హక్కులు మాకే ఇచ్చేయండి అంటూ హీరోలు గుంజేస్తున్నారన్న విష‌యం తెలిసిందే. ఇటు బిజినెస్ అటు పారితోషికాలు చివ‌ర‌కు నిర్మాత‌ల‌కు మిగిలేదేంటో అర్ధం కావ‌డం లేదు. అల వైకుంటపురములో చిత్రానికి హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 19.5కోట్లు దక్కగా.. సరిలేరు చిత్రానికి సుమారు 15కోట్ల మేర పలికిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక సంక్రాంతి బరిలో క్రేజీగా దిగుతున్న ఈ రెండు చిత్రాలకు భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగుతోంది. ఇక వీరిద్ద‌రి చిత్రాల్లో చిర‌వ‌రికి ఎవ‌రిది హిట్ అవుద్దో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: