టాలీవుడ్లో సక్సెస్ కు నిర్వచనం ఎవరు అంటే రాజమౌళి అని చెప్తారు.  రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్ కూడా లేదు.  అయన సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.  సినిమా అంటే ఇలా ఉండాలి.. ఇలానే ఉంటుంది అని నమ్మిన మనిషి రాజమౌళి.  ప్రేక్షకుల నాడిని అర్ధం చేసుకున్న వ్యక్తి కూడా రాజమౌళినే.  అందుకే హీరోలతో సంబంధం లేకుండా రాజమౌళి సినిమాలు ఆడుతుంటాయి.  


ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నిన్న ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడిగా మోరిస్ నటిస్తోంది.  అంతేకాదు, ఈ మూవీలో మరో ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.  అందులో ఒకరు రే స్టీవెన్సన్ కాగా, రెండో వ్యక్తి అలిసన్ డూడీ.  ఈ ఇద్దరు హాలీవుడ్ లో మంచి పేరు ఉన్నది.  ఇద్దరు బడా సినిమాల్లో నటించారు.  


ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు.  చారిత్రాత్మక నేపధ్యం ఉన్నప్పటికీ ఇది ఫిక్షన్ సినిమాగా తెరకెక్కుతోంది.  అంటే ఇందులో నిజం కంటే కల్పితమే ఎక్కువగా ఉంటుంది.  రెండు చారిత్రాత్మక పాత్రలకు కల్పితం జోడించి సినిమాగా తీయడం అంటే మాములు విషయం కాదు.  బ్రిటిష్ నటీనటులకు చోటు ఉండటంతో ఇద్దరు స్టార్స్ ను తీసుకొచ్చారు.  అయితే, ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటంటే.. ఈ సినిమాకు బడ్జెట్ ఎంత అన్నది అందరి ముందున్న ప్రశ్న.  


ఇకపొతే, రాజమౌళి ఈ సినిమాను  ఓ స్ట్రాటజీ ప్రకారం షూటింగ్ చేస్తున్నాడు.  నవంబర్ 18, 2017 లో ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ లు కలిసి ఫోటో దిగారు.  ఈ ఫోటో దిగిన తరువాత ముగ్గురు కలిసి సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.  వార్తలు వచ్చినట్టుగానే సరిగ్గా నవంబర్ 19, 2018 న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభమైంది.  ఇది జరిగిన సంవత్సరానికి అంటే నవంబర్ 20, 2019 న సినిమాలోని హాలీవుడ్ స్టార్స్ ను పరిచయం చేశారు.  ఇలా రాజమౌళి ఒక స్ట్రాటజీతో ఆర్ఆర్ఆర్ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: