నటి శ్రీరెడ్డి ఈ పేరు తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..నటులు అవుదామని వచ్చిన అమ్మాయిలను దారుణంగా ట్రాప్ చేసి లైంగికంగా వాడుకొని రోడ్డున పడేస్తున్నారని ఆరోపించింది. అంతే కాదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ప్రతిరోజూ ఊదరగొడుతూ వచ్చింది.  అదే సమయంలో విద్యార్థి, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తల మద్దతు లభించడంతో ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకు వచ్చింది. ఆమెకు మా అసోసియేషన్ వారు కార్డు ఇవ్వలేదని ఏకంగా ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది.  

 

అప్పటి నుంచి శ్రీరెడ్డి పేరు టాలీవుడ్ లో మారుమోగింది.  ఆ తర్వాత తనతో గడిపిన ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసి సంచలనం రేపింది. తర్వాత తనను లైంగికంగా వాడుకొని జీవితాన్ని సర్వనాశనం చేశాడని నేచురల్ స్టార్ నానిపై ఆరోపణలు చేసింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై కూడా విచురుకు పడింది.  ఇలా ఎన్నో వివాదాలు శ్రీరెడ్డిని చుట్టుముట్టాయి.  ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఐటి దాడుల కలకలం రేపుతుంది. ఉన్నట్లుండి జరిగిన ఐటి దాడులతో ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.

 

నిర్మాత సురేష్ బాబు, హీరో నాని ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి తెగ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా తను ఎప్పట్నుంచో టార్గెట్ చేస్తున్న వాళ్లపైనే ఇప్పుడు ఐటి దాడులు జరగడంలో ఎగిరి గంతేస్తుంది. అభిరామ్ తండ్రి సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్‌పై ఐటి దాడులు జరిగాయి.   ఈ సంద్భంగా మాట్లాడుతూ..దేవుడు ఉన్నాడు సురేష్ బాబు గారూ అంటూ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. మరోవైపు మోదీజీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేసింది కూడా. శ్రీ రెడ్డి కమెంట్స్ చూసి చాలా మంది ఆమెకు సపోర్ట్ చేస్తుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: