సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్స్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్, ఈ సినిమాతో ఎలాగైనా మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ విజయాలు దక్కించుకోవాలని కసిగా వర్క్ చేస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాస్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అలవైకుంఠపురములో. గోల్డెన్ లెగ్ హీరోయిన్ పూజ హెగ్డే బన్నీ సరసన నటిస్తున్న ఈ సినిమాఫై కూడా బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం, 

 

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో, ఈ సారి కూడా వీరు మరొక హిట్ కొట్టితీరుతారని బన్నీ ఫ్యాన్స్ అయితే మరింత నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు రెండూ కూడా సరిగ్గా సంక్రాతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుండడంతో ప్రేక్షకుల్లో కూడా వీటిపై మరింత ఆసక్తి పెరిగింది. కాగా ఈ రెండు సినిమాలు కూడా ప్రమోషన్స్ విషయంలో కూడా ఎంతో పోటీ పడుతున్నాయి. ఎక్కువగా సెంటిమెంట్స్ ని నమ్మే సినిమా పరిశ్రమలో ఈ రెండు సినిమాలు కూడా ఒక చిన్న స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు గమనించవచ్చు. 

 

ఇటీవల దీపావళి సందర్భంగా అలవైకుంఠపురములో సినిమాలోని ఒక సాంగ్ ను సరిగ్గా 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది, అయితే అదే రోజున సరిలేరు నీకెవ్వరు నుండి దీపావళి స్పెషల్ పోస్టర్ ని 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేసింది ఆ సినిమా యూనిట్. ఇకపోతే రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు అలవైకుంఠపురములో నుండి ఓ మై గాడ్ డాడీ సాంగ్ రిలీజ్ కాబోతుండగా, 5 గంటల 4 నిమిషాలకు సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ కానుంది. దీనిని బట్టి చూస్తుంటే, ఈ 4.5, 5.4 టైం లలో ఏదో కొంత మర్మం దాగున్నట్లు అర్ధం అవుతోంది. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో మంచి చర్చగా మారింది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: