టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ కు భలే క్రేజ్ ఉంటుంది. స్టార్ డైరక్టర్ తో స్టార్ హీరో సినిమా అంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు హీరోలు ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ తమిళ దర్శకులతో మన హీరోలు ఇప్పటికే సినిమాలు చేస్తుండగా లేటెస్ట్ గా కన్నడ దర్శకుడితో సినిమాకు సై అంటున్నారు.

 

కన్నడలో కె.జి.ఎఫ్ సినిమతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాను 2020 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెలుగు స్టార్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ముందు ఎన్.టి.ఆర్ ప్రశాంత్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మహేష్ పేరు వినపడ్డది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని అంటున్నారు.

 

అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ డైరక్టర్ ముగ్గురు హీరోల ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని మూడు కథలు సిద్ధం చేసుకున్నాడట. ఒక కథనే ముగ్గురికి చెప్పకుండా వేరు వేరు లైన్లు వారికి చెప్పాడట. అయితే ఈ ముగ్గురిలో ప్రశాంత్ నీల్ మహేష్ తోనే సినిమా ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

 

కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా సూపర్ హిట్ అయితే ఇక ప్రశాంత్ నీల్ కు బాగా డిమాండ్ పెరిగిపోతుంది. కె.జి.ఎఫ్ సినిమా కన్నడలో తెరకెక్కించినా వరల్డ్ వైడ్ గా 250 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కె.జి.ఎఫ్ 2కి 250 నుండి 300 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిస్తున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంద్కే ఈ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: