తొలిసారిగా అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే, తొలి సినిమాతో యావరేజ్ సక్సెస్ ని అందుకుంది. ఇక ఆ తరువాత వరుణ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన ముకుంద కూడా పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అక్కడినుండి వరుసగా ఆమె చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఇటీవల ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరెకెక్కించిన అరవింద సమేతలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి, తొలిసారి అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది పూజ హెగ్డే, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ ప్రక్కన మహర్షి, వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ సినిమాలు చేసి మూడు విజయాలు దక్కించుకుని టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ భామగా మంచి పేరు సంపాదించింది. 

 

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో, అఖిల్ 4వ మూవీ, ప్రభాస్ సరసన జాన్ సినిమాలు చేస్తున్న పూజా, ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వ్యక్తిగత మరియు సినిమా విశేషాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. కాగా నిన్న ఆమె ఒక జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, సమాజంలో మగవారి మాదిరిగానే ఆడవారికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నపుడే దేశం అభివృద్ధి చెందుతుందని, అలానే నేడు ఆడవాళ్లు అన్నింటా తమ సత్తా చూపిస్తూ ఎన్నో అద్భుతాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. 

 

ఇక ఆడవారికి మాత్రమే ఆ దేవుడు అందం అనే వరాన్ని ఇచ్చాడని, ఎప్పటికప్పుడు తమ శరీరాన్ని మరియు సౌదర్యాన్ని కాపాడుకునే ప్రయత్నం ఆడవారు చేయాలని ఆమె చెప్పడం జరిగింది. అలానే నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా ఆడవారు బికినీ వంటివి ధరించి తమ అందాన్ని ప్రదర్శించడంలో తప్పేమి కాదని పూజా చెప్పుకొచ్చింది. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: