వరస విజయాల మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి పండుగ టార్గెట్ చేసుకొని అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని విడుదల చేయబోతున్నారు. మహేష్ బాబు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లాంటి రెండు సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినబడుతోంది. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగకు విడుదలయ్యే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సినిమాలు ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయగా మహేష్ మాత్రం చాలా లేటుగా స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా యూనిట్ పై అభిమానులు ఒత్తిడి తీసుకు వస్తున్న క్రమంలో...మహేష్ సినిమా ప్రమోషన్ విషయంలో చాలా లేటుగా ధీమాగా ఉండటం వెనుక చాలా బలమైన కారణం ఉందని ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే 'సరిలేరు నీకెవరు' సినిమా స్టోరీ..సినిమాకి ప్లస్ అని ఇందు మూలంగానే ప్రమోషన్ కార్యక్రమాలు చాలా లేటుగా మొదలుపెట్టిన ప్రత్యేక నష్టమేమీ ఉండదు అనే భావనలో మహేష్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా నవంబర్ 22 వ తారీఖున సాయంత్రం సినిమాకి సంబంధించి టీజర్ విడుదల కాబోతున్న ఈ క్రమంలో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

 

సోషల్ మీడియాలో గత కొన్ని వారాల నుండి 'సరిలేరు నీకెవ్వరు' అనే ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాతో మహేష్ హ్యాట్రిక్ కొట్టాలని...సోషల్ మీడియాలో అభిమానులు ప్రతీ రోజు కూడా ఈ సినిమా హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో మినిమం లక్ష ట్వీట్లు వేస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద 'సరిలేరు నీకెవ్వరు' సినిమా యూనిట్ ప్రమోషన్ విషయంలో చాలా లేట్ గా ఉన్నాగాని...మహేష్ అభిమానులు మాత్రం చాలా ముందంజలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: