రియాలిటీ షో ఏడేళ్లకు పైగా నిరవధికంగా కొనసాగడం ఓ రికార్డు. ఆ షోకు జడ్జిలుగా ఇంత కాలం పాటు ఒకే వ్యక్తులు ఉండటం కూడా రికార్డే. టీవీల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆ కార్యక్రమమే జబర్దస్త్. ఈ కార్యక్రమం కోసం మూడు దశాబ్దాల క్రితం డీడీలో శుక్రవారం చిత్రలహరి, శనివారం తెలుగు సినిమా కోసం ఎదురు చూసినట్టు ప్రేక్షకులు ఈ ఏడేళ్లూ చూసారంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రజాదరణ పొంది.. ఎందరో పార్టిసిపెంట్స్ కు జీవితాన్నిచ్చింది జబర్దస్త్. ఇటువంటి కార్యక్రమానికి ఇప్పుడు ఓ పెద్ద కుదుపు వచ్చింది.

 

 

జబర్దస్త్ అంటే నాగబాబు – నాగబాబు అంటే జబర్దస్త్.. అనేంతగా పేరొచ్చిన ఈ కార్యక్రమం నుంచి ఏవో కొన్ని కారణాల వల్ల బయటకొస్తున్నట్టు నాగబాబు చెప్పుకొచ్చారు. ఆయన వేరే చానల్ కు వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిందంటున్నారు. ఈసారి నాగబాబుతో కలిసి జడ్జి స్థానంలో కూర్చోబోతోందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే జబర్దస్త్ కు అనసూయ ప్లేస్ ను బిగ్ బాస్ 3 ఫైనలిస్ట్ శ్రీముఖిని తీసుకోబోతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. షోకు నిండుదనం తీసుకురావడం, అల్లరి చేయడంలో అనసూయకు శ్రీముఖి ఏమాత్రం తక్కువ చేయదు. ప్రస్తుతానికైతే ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ లేదు.

 

 

జడ్జిలుగా నాగబాబు – రోజా, యాంకర్స్ గా అనసూయ – రేష్మి.. ఈ షోను టెలివిజన్ షోస్ లో అగ్రభాగాన నిలబెట్టారు. పాపులారిటీని కూడా ఎంతో ఎంజాయ్ చేశారు.  కానీ.. వ్యక్తులు మారిన తర్వాత ఈ షోకు రేటింగ్స్, క్రేజ్ ఏమేరకు ఉంటాయో చూడాల్సిందే. నాగబాబు ప్లేస్ ను ఆలీతో రీప్లేస్ చేస్తున్నారని టాక్. ఇన్నేళ్లు జబర్దస్త్ ను నెంబర్ వన్ గా నిలబెట్టిన మల్లెమాల సంస్థకు ఈ మార్పులు ఎలాంటి ఫలితాలనిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: