ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలలో జరిగే సంక్రాంతి కోడి పందాలకు మించిన స్థాయిలో బన్నీ మహేష్వార్ సంక్రాంతికి జరగబోతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీలలో ఏ మూవీ సంక్రాంతి రేసు విజేతగా మారుతుంది అన్న విషయమై ఇప్పటి నుంచే మహేష్ బన్నీల అభిమానుల మధ్య పందాలు జరుగుతున్నాయి అంటే ఈ మూవీ ఫలితాల గురించి మహేష్ అల్లు అర్జున్ అభిమానులు ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నారో అర్ధం అవుతుంది. 

ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ పాటలు రెండు విడుదలై సంచలనాలు సృష్టించిన నేపధ్యాన్ని కొనసాగించాలని ఈ మూవీకి సంబంధించిన మూడవ పాట ర్యాప్ సాంగ్ ఈరోజు మధ్యాహ్నం విడుదల కాబోతోంది.అదేవిధంగా మహేష్ అనీల్ రావిపూడిల ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీజర్ కూడ ఈరోజునే విడుదల కాబోతోంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ కేవలం ఒక గంట మాత్రమే ఉండటంతో సంక్రాంతికి జరగవలసిన బన్నీ మహేష్వార్ ఈరోజే జరుగుతోందా అని అనిపిస్తోంది.

సాధారణంగా ఒక టీజర్ కు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లోని శబ్దాలయా మరియు రామానాయుడు స్టూడియోలలో జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ డబ్బింగ్ కేరళలోని కొచ్చిన్ లో జరగడం ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుతం మహేష్మూవీ పాటల చిత్రీకరణ కోసం కేరలాలో ఉన్న నేపధ్యంలో హైదరాబాద్ నుండి ఇద్దరు సౌండ్ ఇంజనీర్లు ప్రత్యేకంగా కొచ్చిన్ వెళ్ళి ఈ టీజర్ కోసం మహేష్ బాబు వాయస్ డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది. 

దీనితో ఈమూవీ ప్రమోషన్ విషయంలో ఇక ఎలాంటి ఆలస్యం చేయకూడదు అని మహేష్ చేస్తున్న ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ పాటలు ప్రతి రింగ్ టోన్ లోను వినిపిస్తున్న నేపధ్యంలో ఈరోజు విడుదల కాబోయే ‘సరిలేరు నీకెవ్వరు’ లోని మొదటి పాట అదేవిధంగా టీజర్ కు ఎలాంటి స్పందన వస్తుంది అన్న విషయాన్ని బట్టి బన్నీ మహేష్వార్ లో ఎవరు ఎవరు పై ఆదిపత్యం సంపాదిస్తారు అన్న విషయమై కొంత క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: