‘జబర్దస్త్’ నుండి నాగబాబు వెళ్ళిపోవడం ఖరార్ అయిపోయింది. ఈరోజు ప్రసారం అయ్యే ‘జబర్దస్త్’ షో తరువాత నాగాబాబు ఇక ఈ కార్యక్రమంలో కనిపించడు. ఇక నాగబాబు ‘జీ’ తెలుగు ఛానల్ లో జడ్జిగా వ్యవహరించబోతున్న కొత్త షోకు ‘లోకల్ గ్యాంగ్’ అనే పేరు పెట్టి ‘సరె సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి’ అన్న ట్యాగ్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పుడు ఈ వార్తలు ఇలా వచ్చిన కొద్ది గంటలలోనే నాగబాబు పై విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. బాలకృష్ణను తన సెటైర్లతో విపరీతంగా టార్గెట్ చేసిన నాగబాబు తన లేటెస్ట్ షోకు బాలయ్య పంచ్ డైలాగ్ ను వాడుకోవడం ఏమిటి అంటూ బాలయ్య అభిమానులు నాగబాబును టార్గెట్ చేస్తున్నారు. 

2005 లో విడుదలైన బాలకృష్ణ నటించిన ‘వీరభద్ర’ మూవీలో సరె సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ జరుగుతాయా ఏంటి అన్న డైలాగ్ బాలయ్య నోటి నుండి రావడంతో దానిపై ఎన్నో సెటైర్లు పడ్డాయి. ఇప్పుడు ఆ పంచ్ డైలాగ్ నాగబాబు వాడుకోవడంతో తిరిగి బాలయ్య పై ఇది సెటైర్ గా ప్రయోగిస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 


‘లోకల్ గ్యాంగ్’ కామెడీ షోకు నాగబాబు ఒక జడ్జ్ గా వ్యవహరించబోతుండగా మరో జడ్జ్ గా యాంకర్ అనసూయ వ్యవహరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘జబర్దస్త్’ నుండి అనసూయ తప్పుకోవడంతో ఆ స్థానంను శ్రీముఖి ఆక్రమించినట్లు వార్తలు వస్తున్నాయి. అనేకమంది ‘జబర్దస్త్’ లో పనిచేసే టీమ్స్ ఇప్పుడు ఈ కొత్త కామెడీ షోకి రాబోతున్న నేపధ్యంలో ఇప్పుడు బుల్లితెర పై జరగబోతున్న నాగబాబు చేయబోతున్న కొత్త షోకు ‘జబర్దస్త్’ కు మధ్య పోటీ హాట్ టాపిక్ గా మారబోతోంది. దీనితో ఈ కొత్త షోలో నాగబాబు సక్సస్ కు ఎటువంటి వ్యూహాలు ఎత్తుకుంటాడో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: