మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సినిమా క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. సినిమాలో వైష్ణవ్ తేజ్ డెఫ్ అండ్ డం పాత్రలో కనిపిస్తాడని తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతాడని తెలుస్తుంది. తెలుగు సినిమాల్లో సాడ్ ఎండింగ్స్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరు. అయితే అది ఒకప్పుడు మాట.. ఇప్పుడు కంటెంట్ బాగుండాలి కాని ఎలాంటి సినిమా అయినా చూస్తున్నారు.

 

ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ పాత్ర రంగస్థలంలో రాం చరణ్ పాత్రని పోలి ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చి బాబు తన డెబ్యూ మూవీతోనే క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.

 

తెలుగు ఆడియెన్స్ థోరణి ఈమధ్య చాలా మారింది. మూస కథలను మంగళం పాడేయడమే కాకుండా కొత్త కథలకు స్వాగతం పలుకుతున్నారు. సినిమా హీరో ఎవరు దర్శకుడు ఎవరు అన్నది కూడా కాదు కంటెంట్ బాగుంది అంటే చాలు దాన్ని హిట్ చేస్తున్నారు. ఈ ఉప్పెన సినిమాకు అదే మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలను మించి ఉంటుందని తెలుస్తుంది. సుకుమార్ నిర్మాతగా మారాడు అంటేనే సినిమాలో ఏదో ఒక విషయం ఉండి ఉండొచ్చు. బుచ్చి బాబు సుకుమార్ కు కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ నచ్చే సినిమా ఓకే చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: