మరి కొద్ది గంటలలో  ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ బయటకు రాబోతోంది. మహేష్ అభిమానులు దీనికోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ టీజర్ లోని ఒక పంచ్ డైలాగ్ లీక్ అయింది. ఈ మూవీలో ఒక కీలక పాత్రను చేస్తున్న ప్రకాష్ రాజ్ మహేష్ ను చూస్తూ ప్రకాష్ రాజ్ 'సంక్రాంతికి అల్లుడు వస్తాడు అనుకుంటే మొగుడు వచ్చాడు' అనే డైలాగ్ ఈ టీజర్ కు కీలకంగా మారి మహేష్ అభిమానులకు మంచి జోష్ ను ఇస్తుంది అని అంటున్నారు. 

ఈరోజుతో ఈ మూవీ విడుదలకు 50 రోజుల టైమ్ గ్యాప్ ఉండటంతో ఇక్కడి నుండి ప్రతివారం ఈ మూవీకి సంబంధించిన ఎదో ఒక పాట లేదా మేకింగ్ వీడియో ఇలా ఎదో ఒక ప్రచార అస్త్రంతో ఈ మూవీ పై మ్యానియా పెంచడానికి పక్కాగా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్త్పొంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు విడుదల కాబోతున్న తీజర్ లో మహేష్ బాబుతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ విజయశాంతి కూడ కనిపిస్తారని తెలుస్తోంది. 

వీరి ముగ్గురు మీద మూడు పవర్ ఫుల్  డైలాగులు ఉండే విధంగా ఈ టేజర్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టీజర్ సక్సస్ ను బట్టి ఈ మూవీ హిట్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్న అంచనాలు కట్టబోతున్నారు. 

ముఖ్యంగా ఈ మూవీ పాటలు సక్సస్ ను బట్టి ఈ మూవీ రికార్డులను అంచనా వేయవచ్చనీ పాటలు అందరికీ కనెక్ట్ కాకపోతే అనీల్ రావిపూడి ఈ మూవీ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. మహేష్ ఒక రియల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఈరోజు విడుదల కాబోతున్న టీజర్ సక్సస్ గురించి మహేష్ తో పాటు అతడి అభిమానులు కూడ తీవ్రంగా టెన్షన్ పడుతూ ఈ టీజర్ కు మిలియన్స్ సంఖ్యలో హిట్స్ రావడానికి అన్ని ప్లాన్స్ వేశారని వార్తలు వస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: