నయన తార దశాబ్దన్నర కాలం నుంచి సినీ రంగాన్ని ఊపేస్తోంది. ఆమె దూకుడు ఇప్పటికీ ఆగేలా కనిపించడంలేదు. మూడున్నర దశాబ్దాల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు సవాల్ చేస్తూ దూసుకుపోతున్న నయన్ డిమాండ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ఆమె లేటేస్ట్ గా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయినా సరే నిర్మాతలు నీవే శరణం అంటూ క్యూ కడుతున్నారంటే నయన్ మానియాని ఏమనాలి.

 

తన సినిమాకు ఎనిమిది కోట్ల వరకూ పారితోషికాన్ని పెంచేసిన  నయన్ అలా ఇస్తేనే సినిమా చేస్తానని అంటోంది. అయితే మేము రెడీ అంటున్నారు ప్రొడ్యూసర్లు. ఓ విధంగా సినిమాలు తగ్గించుకుందామని నయన్ ఈ ఎత్తుగడ వేసిందని టాక్. అయితే దానికి కూడా సిధ్ధామని నిర్మాతలు అనడమే కాదు, చేతిలో అడ్వాన్సులు పెట్టి మరీ జై కొడుతున్నారు.

 

దీంతో బిత్తరపోవడం నయన్ వంతు అవుతోందట. ప్రొడ్యూసర్లకు షాక్ ఇద్దామనుకుంటే నయన్ కే వారు రివర్స్ షాక్ ఇచ్చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే నయన్  ఇపుడు ఓ భక్తి సినిమా కోలీవుడ్లో చేస్తోంది. ముక్తి అమ్మన్ అనే మూవీలో నయన్ కన్యాకుమారి అమ్మవారి పాత్ర పోషిస్తోందట. ఈ మూవీ కోసం నయన్ కొన్ని నియమాలను తనకు తానుగానే  పెట్టుకుందిట.

 

షూటింగ్ జరిగినన్నాళ్ళూ పూర్తిగా వెజిటేరియన్ గానే ఉండాలని నయన్ డెసిషన్ తీసుకుందిట. ఈ మూవీలో అమ్మ వారి పాత్ర పోషణలో పవిత్రత ఉండాలని నయన్ ఆ విధంగా చేస్తోందట. క్రిస్టియన్ అయిన నయన్ ఈ విధంగా భక్తి ప్రపత్తులు చూపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అంతకు ముందు అంటే తెలుగులో బాలక్రిష్ణతో చేసిన శ్రీరామరాజ్యం మూవీలో కూడేఅ నయన్ సీత పాత్ర చేస్తున్నపుడు పూర్తిగా వెజిటేరియన్ మాత్రమే స్వీకరించింది. మొత్తానికి నయన్ అభినయమే కాదు, నియమాలు కూడా అదుర్స్ అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: