టెలివిజన్ రంగంలో ఏడేళ్ల పాటు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’లో ఇప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. 2013 నుంచి జబర్దస్త్ తో తన ప్రయాణం మొదలైంది. ఈ ప్రోగ్రామ్ తో పరిచయం అయిన యాంకర్ అనసూయ తన హాట్ అందాలతో కుర్రాళ్లకు కిర్రెక్కించింది.  ఒక్క ఆరు నెలల్లోనే అనసూయకు ఎక్కడలేని పాపులారిటీ రావడంతో ఆమెకు ఇతర చానల్స్ లో వరుస ఆఫర్లు వచ్చాయి.  ఆ తర్వాత వెండి తెరపై ఛాన్సులు వచ్చాయి. అనసూయ తర్వాత ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చి..ఈ అమ్మడు అనసూయనే మరిపించింది. 

 

ఇక  ‘జబర్ధస్త్’ ఎంతో మంది కళాకారులు వెలుగు లోకి వచ్చి ఇప్పుడు ఉన్నత స్థాయిలో జీవనం కొనసాగిస్తున్నారు.  ఇందులో జడ్జీలుగా వ్యవహరిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు, ఎమ్మెల్యే రోజా లు కూడా బాగా పాపులర్ అయ్యారు. మెగాబ్రదర్ నాగబాబు లేని జబర్దస్త్ ను ఊహించుకోవడం చాలా కష్టంగా మారిందంటే అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఈ మద్య జబర్ధస్త్ నుంచి ఒక్కొక్కరూ తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే  జబర్దస్త్ తో ప్రస్థానం కొనసాగిస్తున్న నాగబాబు తన జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నానని, శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ తనకు చివరిదని వెల్లడించారు. 

 


ఆయనతో పాటే.. జబర్ధస్త్ లో స్టార్స్ గా మారిన హైపర్ ఆది, చమ్మక్ చంద్ర,అనసూయ ఇందులో నుంచి బయటకు వెళ్లిపోవడం దాదాపు ఖాయమైంది. మరి ఆ స్థాయిలో కామెడీ పండించాలంటే కొత్తవాళ్లకు సాద్యం కాదు.. ఈ నేపథ్యంలో పాతవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. జబర్ధస్త్ ద్వారా పాపులరై సినిమాల్లోకి వెళ్లిపోయిన వేణు వండర్స్, ధనాధన్ ధన్‌రాజ్, శకలక శంకర్ లాంటి వారిని తిరిగి మళ్లీ జబర్ధస్త్‌లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు కాబట్టి  వీళ్లు కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: