కమల్ హాసన్ గారాల పట్టి...ఆయన నట వారసురాలిగా సినిమా కెరీర్ ప్రారంభించిన శృతి హాసన్ ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభించిన మొదట్లో చాలా హార్డ్ వర్క్ చేసింది శృతిహాసన్. తండ్రి పేరు అడ్డు పెట్టుకోకుండా వరుస అఫర్లతో క్షణం తీరిక లేకుండా తెగ సినిమాలు చేసింది. బాలీవుడ్ సినిమా 'లక్'తో హిందీ సీమలో ఎంటరైంది. కాని ఆ సినిమా శృతికి ఏమాత్రం లక్ ని ఇవ్వలేకపోయింది. టాలీవుడ్ లో 'ఓ మై ఫ్రెండ్', 'అనగనగా ఓ ధీరుడు' సినిమాలలో నటించింది. ఆ రెండు సినిమాలు ఘోర పరాజయాన్ని అందుకోవడంతో తెలుగులో ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. దాంతో శృతికి ఇక తెలుగులో సినిమాలు రావు అనుకున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయి కమర్షియల్ గా ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసింది. 

దాంతో తెలుగు-తమిళం- హిందీన లో వరుసగా ఆఫర్స్ ని అందుకొని సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తరువాత మాంచి ఫామ్ లో ఉండగానే సడన్ గా శృతిహాసన్ సినిమాలు తగ్గించుకోవడం మొదలుపెట్టింది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వ్యక్తిగత కారణాలు.. మానసిక ఒత్తిడి.. ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చింది. బాయ్ ఫ్రెడ్ తో బ్రేకప్ తరువాత మళ్లీ సినిమాలతో బిజీ అవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది.  ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి నటిస్తూ నిర్మిస్తున్న సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శృతిసినిమా అండర్ ప్రొడక్షన్ లో వుండగానే మళ్లీ వరుస ఆఫర్లని సోంతం చేసుకుంటూ బిజీ అయిపోతోంది. తాజాగా తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'కిరాక్' సినిమాకి సైన్ చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై శృతి భారీ అంచానలే పెట్టుకుందట.

ఇక ఈ సినిమా కథాంశం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు గోపీచంద్ తెలిపారు. మాస్ మహారాజ్ గతంలో వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపించబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాతో పాటు శృతి టాలీవుడ్ లో మరిన్ని బిగ్ ప్రాజెక్ట్స్ కోసం ప్లాన్స్  వేస్తోందట. అంతేకాదు తనకున్న పాత పరిచయాలని ఉపయోగిస్తూ ఇంకా  సినిమాలలో అంగీకరించాలని ప్లాన్ చేసుకుంటోందట. దీంతో శృతి.. చరణ్-బన్ని-ప్రభాస్- ఎన్టీఆర్ వంటి స్టార్లకు అందుబాటులోకి వచ్చినట్టేనని తెలుస్తోంది.  ఇక అగ్ర హీరోల్లో చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున వంటి స్టార్లకు శ్రుతి సూటవుతుందా..అనే అనుమాలు మొదలైయ్యాయి. అయితే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రుతిహాసన్ వ్యక్తిగత జీవితంలో సెటిలవ్వాలని అన్నిటిని వద్దనుకుంది. మొత్తానికి ఈ సెకండ్ ఇన్నింగ్స్ అయినా పర్‌ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుందో లేదో చూడాలి..అంటు కొందరు శృతి ఫ్యాన్స్ అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: