నీమనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష, ఫస్ట్ సినిమాతో పెద్ద ఫ్లాప్ నే చవిచూసింది. అయితే ఆ తరువాత సుమంత్ ఆర్ ప్రొడక్షన్స్ బ్యానలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం సినిమా సూపర్ హిట్ తో ఒక్కసారిగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన త్రిష, దాని అనంతరం అదే బ్యానర్ లో సిద్దార్థ తో కలిసి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మరొక సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుండి మెల్లగా టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలెట్టిన త్రిష, ఆ తరువాత కొన్నాళ్ళకు స్టార్ హీరోల సరసన నటించి మంచి సక్సెస్ లు దక్కించుకుని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. 

 

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి హిట్స్ అందుకున్న త్రిష, ఇటీవల కొన్నాళ్లుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఆమె సినిమాలు ఇప్పుడు పెద్దగా సక్సెస్ కావడం లేదు. అందుకే ఎంతో సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్న త్రిష, ప్రస్తుతం ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. అయితే ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన సినిమా, వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే త్రిష, ఇటీవల కొద్దిరోజులుగా కొన్ని రొమాంటిక్ ట్వీట్స్ ని పోస్ట్ చేస్తుండడంతో, ఈమె ప్రేమలో పడిందా ఏంటి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలెట్టారు. అయితే ఈ విషయమై నేడు కొన్ని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

 

త్రిష అతి త్వరలో పెళ్లి చేసుకోబోతోందని, అందుకే ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. చెన్నైకి చెందిన ఒక వ్యాపారవేత్తను త్రిష పెళ్లి చేసుకోబోతోందని, అయితే ప్రస్తుతం ఆ విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆమె కుటుంబం, అతి త్వరలో బహిరంగంగా అందరికీ తెలియపరచనున్నట్లు టాక్. కాగా ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై త్రిష ఫ్యామిలీ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మలేం అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: