టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ నటిమణులు సందడి చేశారు. అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ సాధించారు. ఇటీవల కాలాంలో బాలీవుడ్ నటీమణుల్లో ఒక్క రకూల్ మాత్రమే చాలా కాలం పాటు తెలుగు పరిశ్రమలో కొనసాగింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ పరంగా బాలీవుడ్ బ్యూటీలో కాస్త ఘాటుగానే రెచ్చిపోతుంటారు. దాంతో చాలా వరకు దర్శక, నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు.
అంతేకాదు ఐటమ్ సాంగ్స్ లో కూడా బాలీవుడ్ నటీమణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ మద్య నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ఆహా కళ్యాణం’ మూవీలో హీరోయిన్ గా మెరిసింది బాలీవుడ్ బ్యూటీ వాని కపూర్. అప్పటికే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆ హాట్ బ్యూటీ తెలుగు లో నటించింది ఒక్క సినిమా అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు లో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు తన ఫోటోషూట్కి సంబంధించిన ఫోటోలని రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
బాలీవుడ్ లో అప్పుడప్పుడు తళుక్కున మెరిసే ఈ హాట్ బ్యూటీ ఈ మద్య బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్,టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా రూపొందిన ‘వార్’ మూవీలో బికినీతో రెచ్చిపోయింది. ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న వాణి కపూర్ పై తాజాగా కేసు నమోదు అయ్యంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ అతి ఇప్పుడు కొంప ముంచింది. తాజాగా హిందువుల ప్రధాన దేవుడు రాముడు పేరుతో ఉన్న బ్లౌజ్ ధరించి ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ ఆమెపై మండిపడ్డారు.
రాముడు పేరుతో ఉన్న ఇలాంటి దుస్తులు ధరించి..పైగా సెక్సీ ఫోజులు ఇస్తావా అంటూ.. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు అని ఆమెపై మండి పడ్డారు. అంతే కాదు ఓ వ్యక్తి ఏకంగా ముంబై పోలీసులకి కూడా ఫిర్యాదు చేశాడు. సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదం ముదురుతున్న క్రమంలో వాణి కపూర్ తన ఫోటోని పర్సనల్ అకౌంట్ నుండి తొలగించింది. ఇటీవలే అయోద్య తీర్పు రావడంతో ఇలాంటి పిచ్చిపనులు చేస్తే హిందులు మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఫిలిమ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.