ఈ సంవత్సరం దీపావళికి తెలుగు బాక్సాఫీసు తమిళ సినిమాలు బాగా సమ్దడి చేశాయి. తెలుగులో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో తమిళ చిత్రాలైన బిగిల్, ఖైదీ సినిమాలకి విశేష స్పందన లభించింది. ఇళయదలపతి విజయ్ నటించిన బిగిల్ సినిమా "విజిల్" పేరుతో తెలుగులో ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అటు కార్తీ నటించిన ఖైదీ కూడా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 

ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఒక ఊపు ఊపాయి. అయితే విజయ్ నటించిన బిగిల్ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. అటు తమిళంతో పాటు, తెలుగులో కూడా విజయాన్ని అందుకుని దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో విజయ్ తన తర్వాతి చిత్రం ఏంటనేది ఆసక్తిగా మారింది. అయితే తన తర్వాతి చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబొతున్నాడట.

 

లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమాకి దర్శకుడు. ఖైదీ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా సినిమా తీసి మంచి హిట్ అందుకున్నాడు. అలాంటి దర్శకుడితో విజయ్ సినిమా చేస్తున్నాడంటే అభిమానుల్లో అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతుంది ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించకపోయినప్పటికీ సభవం అనే పేరు పరిశీలనలో ఉంది.

 

నవరి 1వ తేదీన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని కూడా అంటున్నారు. దీంతో విజయ్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. నూతన సంవత్సరం కానుకగా  విజయ్ తన అభిమానులకి  ఈ ట్రీట్ ఇస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా మాళవిక నాయర్‌ కథానాయిక. శాంతను, ఆంథోని వర్గీస్, రమ్యా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మరి ఈ సినిమా కూడ బిగిల్, ఖైదీలాగా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: