టాలీవుడ్ సుపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎంతో భారీగా నిర్మితం అవుతున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. 

 

బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. అలానే ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12నే రిలీజ్ అవుతుందని డేట్ ప్రకటించడం జరిగింది. అయితే కాసేపటి క్రితం కొందరు టాలీవుడ్ సినిమా ప్రముఖుల సమక్షంలో, ఈ రెండు సినిమాల నిర్మాతలు కూర్చుని చర్చించి ఒక మంచి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దానిని బట్టి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ఒక రోజు ముందుగా, అనగా జనవరి 11న రిలీజ్ చేయాలనీ, అలానే అల్లు అర్జున్ అలవైకుంఠపురములో సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలనీ డేట్స్ ఫిక్స్ చేసారు. ఈ విషయమై కాసేపటి క్రితం అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. 

 

గతంలో గద్దలకొండ గణేష్, గ్యాంగ్ లీడర్ సినిమాల విషయమై కూడా ఈ విధంగానే జరిగితే, ఆయా సినిమాల నిర్మాతలు సయోధ్యకు వచ్చి తమ సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకున్నారని, ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల నిర్మాతలు కూడా సయోధ్యతో తమ సినిమాల రిలీజ్ డేట్స్ విషయమై రాజీకి రావడం ఎంతో గొప్ప ఆహ్వానించదగ్గ పరిణామం అని పలువురు సినిమా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ కావడంతో, రెండిటికి ఫస్ట్ డే ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: