సంక్రాంతి సమయంలో సినిమాలను  విడుదల చేసేందుకు హీరోలు దర్శకులు నిర్మాతలు ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు . సంక్రాంతి సమయాన్ని సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజున మంచి  రోజు అనే కాకుండా సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతికి ఎక్కువమంది థియేటర్కు వెళ్లి సినిమా చూడటానికి  ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా సంక్రాంతికి సెలవులు కూడా వస్తాయి. దీంతో సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలకు భారీ కలెక్షన్లు ఖాయం అనేది  దర్శకనిర్మాతలు నమ్మకం . అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలు నిలువ  బోతున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలైన  మహేష్ బాబు అల్లు అర్జున్ సినిమాలు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. ఈ నేపథ్యంలో అటు దర్శకనిర్మాతలే  కాదు ఇటు బయ్యర్లు కూడా అయోమయంలో పడ్డారు. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే రెండు సినిమాలకు కలెక్షన్ లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 

 

 

 అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠ పురములో  లో సినిమా తెరకెక్కుతుంది... మహేష్ బాబు అనిల్ రావిపూడి  దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతోంది.  అయితే ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అంతేకాకుండా అల్లు అర్జున్ త్రివిక్రమ్.... మహేష్ బాబు అనిల్ రావిపూడి ఈ రెండు హిట్ కాంబినేషన్ లు  కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగి పోయాయి. అయితే ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు జనవరి 12న విడుదల చేసేందుకు నిర్ణయించారు. కానీ అటు బయ్యర్లు దర్శక నిర్మాతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. చివరికి ఈ ఇద్దరు  హీరోలు నిర్మాతలు మధ్య ఒప్పందం కుదిరినట్లు కనిపిస్తోంది. ఇద్దరి హీరోల సినిమాలు  ఒకేసారి విడుదల అయితే కలెక్షన్లు తగ్గుతాయని సినిమాపై ప్రభావం పడుతుందని దర్శక నిర్మాతలు  హీరోలకు సూచించడంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. 

 

 

 

 ఈ రెండు సినిమాల నిర్మాతలైన దిల్ రాజు, అల్లు అరవింద్ లు  రెండు సినిమాల విడుదల తేదీల పై చర్చించి తమ సినిమాలు విడుదల  తేదీల్లో మార్పులు చేర్పులు చేశారు. అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల అవుతుండగా ఇక అనుకున్నట్లుగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురము  లో జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అఫీషియల్ గా  ప్రకటించారు. దీంతో అటు బయ్యర్లు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఒక్క రోజు తేడాతో కాస్తయినా వసూళ్ళ పరంగా తేడా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో... బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి మాయ చేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: