టాలీవుడ్ కామెడీ దర్శకుల్లో ఒకరిగా తనదైన మార్క్ చాటుకుంటున్నారు అనీల్ రావిపూడి. టాలీవుడ్ మాస్ మహరాజగా పేరు తెచ్చుకొని హిట్స్ లేని సమయంలో రెండేళ్లు వెనక్కి తగ్గి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజకు ‘రాజా ది గ్రేట్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించారు.   ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష-వరుణ్ తేజ్ కి ‘ఎఫ్ 2 ’ మరో సూపర్ హిట్ అందించారు.  వరుస విజయాలు అందుకుంటున్న అనీల్ రావిపూడికి టేకింగ్ బాగా నచ్చడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ తర్వాత ఈ యువదర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు.  

 

ఈ ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ అయ్యింది.  ప్రస్తుతం అనీల్ రావిపూడి-మహేష్ బాబు కాంబినేషన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతుంది.   ఈ మూవీలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి.  మొదటి సారిగా మహేష్ బాబు  ఓ సైనికాధికారి పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత విజయశాంతి వెండి తెరపై కనిపిస్తున్నారు. మహేష్ బాబు - విజయశాంతి కాంబినేష్ దాదాపు 23 ఏళ్ల తర్వాత వస్తుంది.

 

ఇక ఈ మూవీ లో విజయశాంతి పాత్ర గంభీరంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇక మూవీ టీజర్ లో మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ దుమ్మురేపుతున్నాయి.  ‘మీకూ మాకు ఏ రక్త సంబంధం లేదు..కానీ మీ కోసం మీ పిల్లల కోసం పగలూ..రాత్రి..ఎండా వానా అనేది తేడా లేకుండా పోరాడుతూనే ఉంటాం.  ఎందుకంటే మీరు మా బాధ్యత.., మీరంతా మేం కాపాడుకొనే ప్రాణాలు రా.. మీ కోసం ప్రాణాలు ఇస్తున్నాం రా అక్కడ... కానీ మీరేమో కత్తులు పట్టుకొన ఇలా ఆడాళ్ల...బాధ్యత ఉండక్కర్లా.. , భయపడే వాడే బేరానికి వస్తాడు..మనదగ్గర బేరాల్లేవమ్మా అంటూ మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్ దుమ్మురేపుతున్నాయి.

 

గాలి విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్ అంటూ విజయశాంతి డైలాగ్.. ప్రతి సంక్రాంతికి అళ్లుళ్లొస్తారు..ఈసారి మొగుడొస్తున్నాడు..అంటూ ప్రకాశ్ రాజ్ డైలాగ్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈసారి సూపర్ స్టార్ దే అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: