సూపర్ స్టార్ మహేష్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో తారాస్థాయిలో అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది.

 

ఈ టీజర్ చూశాక సినిమా పక్కా హిట్ అన్న సంకేతాలు వస్తున్నాయి. మహేష్ స్టామినాను డైరక్టర్ అనీల్ రావిపుడి పర్ఫెక్ట్ గా వాడుకున్నట్టుగా ఉన్నాడు. సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి నిజమైన పండుగ తెచ్చే సినిమాలా ఉంది.

 

టీజర్ తో సినిమా రేంజ్ పెంచిన డైరక్టర్ అనీల్ రావిపుడి పంచు డైలాగులను వదిలాడు. ముఖ్యంగా అక్కడ మేం ప్రాణాలు కాపాడుతుంటే ఇక్కడ మీరు అంటూ మహేష్ చెప్పే డైలాగ్ తో పాటుగా నా దగ్గర బేరాళ్లేవమ్మా అంటూ కొండారెడ్డి బురుజు దగ్గర చెప్పే డైలాగ్ కూడా అదిరిపోయింది. మహేష్ ను ఫుల్లుగా వాడేసుకున్న అనీ రావిపుడి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.

 

ఇక టీజర్ చివరగా ప్రకాశ్ రాజ్ వచ్చి ప్రతి సంక్రాంతికి అళ్లుల్లొస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు అంటూ బాక్సాఫీస్ పని చెప్పే ఘరనా మొగుడుగా మహేష్ తన సత్తా చాటేలా ఉన్నాడు. అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ చేస్తుంటే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మహేష్ టీం టీజర్ తో సర్ ప్రైజ్ చేసింది. సరిలేరు నీకెవ్వరు చూస్తుంటే మహేష్ కు హ్యాట్రిక్ హిట్ ఇచ్చేలా ఉంది. అనీల్ రావిపుడి, మహేష్ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: