సినిమాల్లో మాత్రమే కాకుంబా సినిమాల విషయంలో కూడా పాటించే ఒకే ఒక నియమం సెంటిమెంట్. దీని ఆధారంగానే సినిమా తెరకెక్కుతుంది.. సినిమా పండుతుంది. దీనికి కాంబినేషన్లు, లొకేషన్లు, రిలీజ్ టైమ్.. ఇలా అన్ని ఇందులో ఇమిడి ఉంటాయి. 2020 సంక్రాంతికి వస్తున్న మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఇలానే ఓ సెంటిమెంట్ చూపిస్తోంది. రాజకుమారుడు నుంచి ఇప్పటి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకూ మహేశ్ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్.

 

 

వీరిద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. రాజకుమారుడు, బాబీ, ఒక్కడు, అర్జున్, అతడు, పోకిరి, సైనికుడు, బిజినెస్ మేన్, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అను నేను, మహర్షి.. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషనే హైలైట్ అయిన సినిమాలూ ఉన్నాయి.. ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ హెల్ప్ అయిన సినిమాలున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో కూడా ప్రకాశ్ రాజ్ -  మహేశ్ మధ్య వచ్చే సీన్లు సినిమాకు ప్లస్ అవుతాయని సమాచారం. సెంటిమెంట్ పండించడంలో ప్రకాశ్ రాజ్ కు తిరుగులేదు. ఎన్నో సినిమాల్లో ఇది ప్రూవ్ అయింది. మహేశ్ కాంబినేషన్ లో తెరమీద వీరిద్దరూ కలిసి చేసిన సీన్లు కూడా ఛాలెంజింగ్ గా ఉంటాయని కూడా ప్రూవ్ అయింది. మరోసారి వీరిద్దరి కాంబో ప్రేక్షకలను అలరించబోతున్నట్టు సమాచారం.

 

 

వచ్చే సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న ఈ సినిమా టీజర్ కూడా ఇప్పటికే విడుదలైంది. యూట్యూబ్ లో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్న టీజర్ తో అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో కామెడీ, సీరియస్, సెంటిమెంట్ కు కొదవలేదనేది టీజర్ ను బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమా ఎన్ని వండర్స్ చేయనుందో చూడాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: