మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముకుందా సినిమా నుంచి పూర్తిగా వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఇటీవలే ‘గద్దలకొండ గణేష్’ సినిమాలోను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమా తరవాత వరుణ్ ఒక బాక్సింగ్ డ్రామాను ఓకే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో వార్త తాజాగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విషయంలో వరుణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్.

తాజాగా వరుణ్ తేజ్‌కు దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక కథను నెరేట్ చేసినట్టు లేటెస్ట్ న్యూస్. ఈ కథ వరుణ్ తేజ్‌కు బాగా నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపేశారని తెలుస్తోంది. అంతేకాదు, కిరణ్ కొర్రపాటి సినిమా కన్నా ముందే సురేందర్ రెడ్డి సినిమా మొదలుపెట్టాలని వరుణ్ నిర్ణయించుకున్నారట. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

వరుణ్ తేజ్‌కు చెప్పిన కథను కొద్ది రోజుల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్‌కు సురేందర్ రెడ్డి చెప్పారట. కానీ, ప్రభాస్ ఇప్పటికే తన సొంత బ్యానర్‌లో సినిమాకు కమిటయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాదికి కాని పూర్తవుతుంది. అంతేకాదు, వచ్చే ఏడాది డిసెంబర్ వరకు తన డేట్లు ఖాళీలేవని.. అందుకే చేయలేనని ప్రభాస్ చెప్పేశారట. దీంతో అదే కథను సురేందర్ రెడ్డి.. వరుణ్ వద్దకు తీసుకెళ్లారని చిత్ర వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇక వరుణ్ కూడా వెంటనే ఓకే చెప్పేయడంతో ఇక ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతోందని చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ ప్రభాస్ ని పక్కకు తోసేశాడని చెప్పుకుంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: