ఇష్టం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు శ్రీనివాసరెడ్డి. ఇడియట్, వెంకీ, రెడీ, ఆంజనేయులు, పరుగు వంటి చిత్రాల్లో నటించి తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తారాయన. గీతాంజలి చిత్రంతో హీరోగా మారారు. హీరోగా నటించినా తిరిగి కమెడియన్గా అవకాశాలను వదలకుండా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా నిర్మాతగా మారారు.
శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’. ఈ సినిమా ద్వారా శ్రీనివాసరెడ్డి దర్శక నిర్మాతగా మారారు. కామెడీ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ఝాన్సీ, సన, మహేష్ విట్ట, సన్నీ, డాలీషా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు.
అంతేకాక శ్రీనివాసరెడ్డికి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అభినందనలు తెలిపారు. ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’ ట్రైలర్ను ట్వీట్ చేసిన రాజమౌళి.. ‘‘మంచి హాస్యనటుల్లో శ్రీనివాసరెడ్డి ఒకరని నా కెరీర్ ప్రారంభం నుంచి శ్రీనివాసరెడ్డి నాకు తెలుసని ఆయన పేర్కొన్నారు. దర్శకుడిగా, నిర్మాతగా పరిచయమవుతోన్న శ్రీనివాసరెడ్డికి అభినందనలు’’ అని తన సోషల్ మీడియా ద్వారా ఆయనకు తెలిపారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 6న సినిమాను విడుదల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ప్లేను అందించగా, శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా మారుతున్నారు. ఆయన టేకింగ్, నటన ఆకట్టుకుంటాయి' అని చిత్ర బృందం తెలిపింది. సత్యం రాజేశ్, రఘుబాబు, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ కొమండూరి, కెమెరా: భరణి కె.ధరణ్, ఎడిటర్: ఆవుల వెంకటేష్, ఆర్ట్: రఘు కులకర్ణి.