అతనో స్టార్ డైరక్టర్ టాలీవుడ్ స్టార్ హీరోలతో మాస్ సినిమాలు తీసి సేన్సేషనల్ హిట్ అందుకున్నాడు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఆ డైరక్టర్ ఇప్పుడు కెరియర్ లో కొత్త టర్న్ తీసుకున్నాడు. ఇన్నాళ్లు డైరక్టర్ గా మెప్పించిన ఆయన సడెన్ గా హీరో అవ్వాలనుకున్నాడు. తన స్నేహితుడు బడా నిర్మాతతో సినిమా మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఆల్రెడీ ఆ డైరక్టర్ చేసిన రెండు సినిమాల్లో హీరోయిన్ ను తీసుకున్నారట.

 

హీరోయిన్ కూడా దశాబ్ధ కాలంగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది. ఈమధ్యనే పెళ్లైనా సినిమాలను మాత్రం వదలట్లేదు. అయితే ఈ డైరక్టర్ తను హీరోగా చేస్తున్న సినిమాలో ఆ పెళ్లైన హీరోయిన్ ను ఫిక్స్ చేశారట. ఆమెతో సినిమాలు చేసే టైంలోనే ఆమెతో నటించాలన్న కోరిక ఉన్న ఈ డైరక్టర్ ఇప్పుడు అది నెరవేర్చుకుంటున్నాడు. 

 

ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరు.. ఆ హీరోయిన్ ఎవరనేగా మీ డౌట్.. ఇంకెవరు ఆ కమర్షియల్ డైరక్టర్ వినాయక్ కాగా ఆ అందాల భామ శ్రీయా శరణ్. డైరక్టర్ గా వినాయక్ క్రేజీ హిట్లు ఇచ్చాడు. అయితే ఈమధ్య ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అందుకే హీరోగా టర్న్ అయ్యి శీనయ్య అని సినిమా మొదలుపెట్టాడు. ఈ మూవీని నరసిం హా డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 

సినిమాలో హీరోయిన్ గా శ్రీయా శరణ్ నటిస్తుందట. డైరక్టర్ గా పరిచయం ఉన్న వినాయక్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్ గా చేయడం స్పెషల్ గా అనిపిస్తుంది. ఈమధ్య సీనియర్ హీరోలకు శ్రీయ శరణ్ ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. ఇక ఈ సినిమాతో పాటుగా అసురన్ తెలుగు రీమేక్ లో వెంకటేష్ సరసన మరో లక్కీ ఛాన్స్ అందుకుంది శ్రీయ. చిరంజీవి 152వ సినిమాలో కూడా శ్రీయ హీరోయిన్ గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. చూస్తుంటే పెళ్లి తర్వాత శ్రీయ కూడా ఫుల్ బిజీగా ఉందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: