తెలుగు చిత్రపరిశ్రమలో బాహుబలితో రీజినల్‌ సినిమాలకు జాతీయ స్థాయిలో మార్కెట్‌ ఓపెన్‌ కావటంతో స్టార్‌ హీరోలు కూడా పాన్‌ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టారు. వీరితో పాటుగా ఈ జనరేషన్‌ యంగ్ హీరోలు కూడా పాన్‌ ఇండియా సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో పాన్‌ ఇండియా సినిమాల హవా కనిపిస్తుంది. ఇక ఈ లిస్ట్‌లో తాజాగా యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా చేరబోతున్నాడని వినికిడి.

 

 

ఇక ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ తాను చేయబోయే నెక్ట్స్‌ సినిమాను కూడా అదే స్థాయిలో చేయాలని ప్లాన్‌ చేశాడు. అందుకే ముందుగా అనుకున్న కథనే స్కేల్‌ పెంచి భారీ బడ్జెట్‌తో సాహోగా రూపొందించాడు. అయితే ప్రభాస్‌ ప్లాన్‌ ఆశించిన స్థాయిలో వర్క్‌ అవుట్ కాలేదు. ఈ సినిమాకు భారీగా నష్టాలు రాకపోయినా సూపర్‌ హిట్ అన్న టాక్‌ మాత్రం రాలేదు. దీంతో ఇప్పుడు నెక్ట్స్‌ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు డార్లింగ్‌.

 

 

ఇక్కడ అర్ధం చేసుకోవలసింది ఏంటంటే ఓ భారీ చిత్రం తరువాత మరో పాన్‌ ఇండియా సినిమా చేసిన ప్రభాస్‌ ఫెయిల్‌ అయ్యాడు అని.. ఇక ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

 

 

సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. మరి ఆర్ఆర్ఆర్‌ లాంటి పాన్‌ ఇండియా సినిమా తరువాత మరోసారి అదే స్థాయిలో సినిమా చేస్తే తారక్‌ సక్సెస్‌ అవుతాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. త్రివిక్రమ్‌ గ్రాఫ్‌ కూడా ఆ స్థాయిలో లేకపోవటంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు.

 

 

ఆర్ఆర్‌ఆర్‌ తరువాత ఓ మంచి కమర్షియల్ సినిమా చేస్తే తారక్‌ తెలుగులో టాప్‌ చైర్‌కు మరింత చేరువవుతాడు. కానీ అలాంటి సమయంలో పాన్‌ ఇండియా సినిమా చేయటం రిస్క్‌ అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. మరి ఈ విషయంలో ఎన్టీఆర్‌ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: