టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన 'గీతా గోవిందం' సినిమా అప్పట్లో సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్న తరువాత విజయ్ దేవరకొండ నటించిన ఈ క్లాసికల్ సినిమా అప్పట్లో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి కొన్ని కోట్ల లాభాలు నిర్మాతకి తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో డైరెక్టర్ పరుశురాం పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతట వినబడింది. ఇటువంటి నేపథ్యంలో చాలా స్క్రిప్టులు రెడీ చేసి చాలా మంది స్టార్ హీరోలకు పరశురామ్ స్టోరీ వినిపించిన పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇటువంటి నేపథ్యంలో చివరాకరికి ఇటీవల అక్కినేని నాగచైతన్యకు ఒక కథ చెప్పి సినిమా ఓకే చేయించుకున్నారట డైరెక్టర్ పరుశురాం.

 

అయితే అధికారికంగా ఈ సినిమాకి సంబంధించి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వార్తలు బయటకు రాకపోయినా ఇండస్ట్రీలో మాత్రం నాగచైతన్య మరియు పరశురామ్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా వస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా గీతా గోవిందం సినిమా కి ముందు కోటి రూపాయల లోపే రెమ్యునరేషన్ తీసుకునే పరశురాం తాజాగా మాత్రం 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

అంతేకాకుండా ఇండస్ట్రీలో చాలా మంది ఐదు కోట్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వటానికి కూడా అప్పట్లో ముందుకు వచ్చినట్లు ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వినపడ్డాయి. కాగా గీత గోవిందం సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురాం ఇండస్ట్రీలో ఉన్న ఏదైనా పెద్ద స్టార్ హీరోతో సినిమా చేద్దామని ప్లాన్ చేసిన గానీ పెద్దగా కుదరకపోవడంతో..మరియు అదే విధంగా కొంతమందికి కథలో చెప్పిన వారికి ఎక్కడో అక్కడ నచ్చకపోవడంతో వెంటనే ఇటీవల నాగచైతన్యకి స్టోరీ చెప్పి చైతు తో సినిమా చేయడానికి డైరెక్టర్ పరుశురాం రెడీ అయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: