రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ....800 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు, విశేషమైన ఆదరణ లభించిందని తెలిపింది. అలాగే పప్పు లాంటి అబ్బాయి పాట కూడాఅశేష ప్రేక్షక వాహిని ఆదరణతో ట్రెండింగ్ అయ్యిందని చిత్రబృందం వెల్లడించింది.
ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదని...ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపధ్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్పష్టం చేసింది. ఇందులోని ఏడు పాటలు ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజయ్య సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్.
ఇక ఇదిలా ఉంటే...ఇప్పటికే రిలీజ్కు రెడీగా ఉన్న ఈ సినిమాకు వర్మ..సీక్వెల్ ప్రకటించాడు. ఈ సినిమాకు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ ఖరారు చేసాడు. అంతేకాదు ఈ సినిమాలో తాజాగా ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను చర్చించబోతున్నట్టు ప్రకటించాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఈ సినిమా టైటిల్ ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నట్టు ఉందని యాంకర్ ప్రశ్నిస్తే.. ఇప్పటికే రెడ్డి టైటిల్స్తో పాటు నరసింహానాయుడు అని పెదరాయుడు, సీతారామరాజు అని ఎన్నోకులాన్నే గుర్తు చేసే టైటిల్స్తో సినిమాలు వచ్చాయని ప్రస్తావించారు. ఒకవేళ ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. వెంటనే ఈ సినిమా టైటిల్ అయిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ను ‘మక్క రాజ్యంలో డకప రెడ్లు’ అనే టైటిల్ ప్రకటిస్తానని చెప్పారు. ఇప్పటికే ఆ టైటిల్తో కొన్ని పోస్టర్స్తో పాటు సినిమాను కూడా రెడీ చేసినట్టు చెప్పకొచ్చారు. మొత్తానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ పై సెన్సార్ కొర్రీలు వేస్తే మాత్రం.. రామ్ గోపాల్ వర్మ.. కొత్త టైటిల్తో ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తునట్టు తెలుస్తోంది.