ఆరేళ్ల నుండి బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్న జబర్దస్త్ షోలో కొత్తగా మార్పులు జరుగబోతున్నాయి. జబర్దస్త్ జడ్జ్ మెగా బ్రదర్ నాగబాబుతో సహా మరో ముగ్గురు కంటెస్టంట్స్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కు బై బై చెప్పేశారు. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అని చెబుతున్నా రెమ్యునరేషన్ డిమాండ్ వల్ల వీరి బయటకు వెళ్లినట్టు తెలుస్తుంది.

 

ఇదిలాఉంటే జబర్దస్త్ సక్సెస్ ఫుల్ అవగా దాన్ని రెండు పార్టులుగా చేసి ఎక్స్ ట్రా జబర్దస్త్ అని కొత్త షో మొదలు పెట్టారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు కొంతమంది కమెడియన్స్ బయటకు వెళ్లడంతో రెండుగా ప్రసారమవుతున్న ఈ షోని మళ్లీ ఒకటి చేసే ఆలోచనలో ఉన్నారట.

 

జబర్దస్త్ ను మాత్రమే కొనసాగించి ఎక్స్ ట్రాని కట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రెండిటిలో ఉన్న టీం మెట్స్ ను కలిసి ఒకషోనే ఏర్పాటు చేస్తున్నారట. ఇదిలాఉంటే బయటకు వస్తున్న ఈ వార్తలన్ని రూమర్స్ అని కొట్టిపార్శ్తున్నారు. నాగబాబుతో కొంతమంది టీం మెబర్స్ వెళ్లినా జబరస్త్ కొనసాగుతుందని. అనసూయ బదులుగా జబర్దస్త్ కు శ్రీముఖి యాంకరింగ్ చేయనుందని తెలుస్తుంది.

 

అనసూయ ప్లేస్ లో వస్తున్నందుకు శ్రీముఖి రెమ్యునరేషన్ కూడా భారీగానే ఇస్తున్నట్టు తెలుస్తుంది. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన నాగబాబు అండ్ టీం మెట్స్ అందరు జీ తెలుగులో సర్ సర్లే ఎన్నెన్న్నో అనుకుంటాం షోలో కనిపించారు. జీ తెలుగులో జబర్దస్త్ లాంటి ఓ రియాలిటీ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారట. దానికి గ్యాంగ్ స్టర్స్ అని పేరు పెట్టి త్వరలో మొదలు పెడతారని తెలుస్తుంది. అయితే జబర్దస్త్ లో చేసి ఇదివరకే బయటకు వెళ్లిన వారిని జీ తెలుగు వారు ఎర వేస్తున్నారు. ఆల్రెడీ వేణు, ధన్ రాజ్ వంటి వారు జీ తెలుగు కొత్త కామెడీ షోలో కనిపించనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: