ఎంతో కాలం తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఎవ్వబోతున్నారు. మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, కృష్ణ...ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించడమే కాదు ఆ స్టార్ అందరికి పోటిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ లో కనిపించింది రెండు ఫ్రేముల్లోనే అయినా.. విజయశాంతి ఛార్మ్ ఏ మాత్రం తగ్గలేదన్న టాక్ వినిపించింది. అంతేకాదు విజయశాంతి స్క్రీన్ ప్రెజన్స్ పై పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. 

ఈ విషయం అలా ఉంచితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన న్యూస్ బాగా వైరల్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకంటే ముందే విజయశాంతితో చాలామంది చాలా ప్రాజెక్టులు అనుకున్నా వర్కవుట్ కాలేదట. క్యారెక్టర్ నచ్చకో లేక ఇంట్రస్ట్ కలగకనో ఆవిడ అందరికి నో చెప్పారట. అంతేకాదు  అనిల్ రావిపూడి కూడా విజయశాంతిని గతంలోనే రీఎంట్రీ కోసం ట్రై చేశారట. చిన్నతనం నుంచి ఆవిడ డైనమిజమ్ కు వీరాభిమాని అట. అందుకే ఆమెతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనిల్ రావిపూడి అనుకున్నాడట.

 

కానీ.. ఏదో ఒక కారణంగా ఈ కాంబినేషన్ కుదరలేదట. వాస్తవానికి విజయశాంతి కోసం ఒక పాత్రను సిద్ధం చేసుకున్నాడట అనిల్. ఆయన తీసిన రాజా ది గ్రేట్ సినిమాను ముందు రామ్ తో అనుకున్నారట. ఆ సినిమాలో రామ్ తల్లి పాత్రలో విజయశాంతిని అనుకున్నారట. అయితే.. ఆ ప్రాజెక్టు నుండి రామ్ తప్పుకొని రవితేజ ఎంటరవటంతో విజయశాంతి రీఎంట్రీ ఆగిపోయిందట. ఇక్కడ ఆగిపోవడానికి ముఖ్య కారణం ఇద్దరి మధ్య సెట్ అవని ఏజ్ అట.

 

అయితే ఎప్పటికైనా తనకు తగ్గ పాత్ర తీసుకు వస్తే కచ్ఛితంగా చేస్తానని అనిల్ రావిపూడితో విజయశాంతి చెప్పారని.. రాజా దిగ్రేట్ లో కాదనుకొని తాజా సినిమాలో భారతి పాత్ర రాసుకున్న తర్వాత.. దానికి విజయశాంతి  తప్పించి మరెవరినీ తాను ఊహించలేదని అనిల్ చెబుతున్నాడు. మొత్తానికి విజయశాంతి రీఎంట్రీ ఆలస్యానికి రవితేజ కూడా ఒక కారణమని అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: