సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేయడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం.. ఆ తర్వాత వదులుకున్నందుకు ఆ హీరో బాధపడటం షరా మామూలుగా జరుగుతున్నదే. అయితే ఇదే పొరపాటు హీరోయిన్స్ విషయంలోను తరచూ జరుగుతుంటుంది. అయితే హీరోయిన్స్ కి మైలేజ్ బాగా తక్కువ కాబట్టి ఒక్క హిట్ వీళ్ళ ఖాతాలో పడితే ఆ తర్వాత సినిమాకి డిమాండే వేరేలా ఉంటుంది. ఇక ప్రస్తుతం అవకాశాల్లేక అల్లాడుతున్న టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఒకప్పుడు వచ్చిన చక్కటి అవకాశాల్ని వదులుకున్న ఈ బ్యూటీ.. అలా వదులుకున్న ఓ బ్లాక్ బస్టర్ సినిమా మీద ఇన్నాళ్ళకు తాజాగా స్పందించింది. అయితే తను మిస్ చేసుకున్న సినిమా 'గీతగోవిందం'. ఈ సినిమాలో ముందుగా లావణ్య త్రిపాఠీనే అనుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా వదులుకున్న విషయమై తాజాగా రియాక్ట్ అయింది లావణ్య.

 

"ఎస్.. ఆ స్క్రిప్ట్ ముందుగా నాకే వచ్చింది. ఆ స్క్రిప్ట్ నాకు నచ్చింది కూడా. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. కొంచెం బాధగానే ఉంది." అర్జున్ సురవరం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టింది లావణ్య. ఇలా 'గీతగోవిందం' సినిమా మిస్ అవ్వడంపై కాస్త బాధ పడింది లావణ్య. ఈ ముద్దుగుమ్మ నో చెప్పిన తర్వాత ఆ సినిమా కోసం అను ఎమ్మాన్యుయేల్ ను సంప్రదించారు. ఆమె కూడా కాల్షీట్ల సమస్య కారణంగా నో చెప్పింది. అలా ఇద్దరు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ ను ఓకే చేసిన రష్మిక.. 'గీతగోవిందం' సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

 

అయితే ఆఫర్ మిస్ అయినా తనదైన శైలిలో దాన్ని కవర్ చేసుకుంది లావణ్య. తను అవకాశాల వెంట పడనని, తనకు నచ్చిన సినిమాలని మాత్రమే ఎంపిక చేసుకుంటానని అంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో ఒక మంచి సినిమా పడితే బావుండునని ఎదురు చూస్తోంది. ఇక రీసెంట్ గా సందీప్ కిషన్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. A1-ఎక్స్ ప్రెస్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మరి అర్జున్ సురవరం సినిమాతోనైనా మళ్ళీ లావణ్య ఫాం లోకి వస్తుందేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: