తెలుగు, తమిళ లో తెలుగమ్మాయి అంజలి కి హీరోయిన్ గా మంచి పేరుంది. అలాగే అంజలి-జై డేటింగ్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈఇద్దరి లవ్ స్టోరీ ఓపెన్ సీక్రెట్ అన్న విషయం కూడా తెలిసిందే. కలిసి ఒకే అపార్ట్ మెంట్ లో గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ రీసెంట్‌గా విడిపోయారు. జై నుంచి విడిపోయిన తర్వాత అంజలి పూర్తిగా టాలీవుడ్ కే పరిమితమైంది. చెన్నై నుంచి మకాం మార్చేసి హైదరాబాద్ లోనే ఉంటోంది. మధ్యలో షూటింగ్ పనిమీద చెన్నై వెళ్లినా అయిపోగానే తిరిగి హైదరాబాద్ వచ్చేస్తోంది. అంతగా డిస్ట్రబ్ అయింది మన తెలుగమ్మాయి.

 

ఇలా హీరో జై కు దూరంగా ఉంటున్న అంజలి గురించి రీసెంట్‌గా ఓ నిర్మాత స్పందించాడు. అంజలి కెరీర్ ను జై నాశనం చేశాడని ఆరోపించాడు నిర్మాత నందకుమార్. గతంలో జై-అంజలి హీరోహీరోయిన్లుగా బెలూన్ అనే సినిమా నిర్మించిన ఈ నిర్మాత.. జై పై తీవ్రంగా విమర్శలు చేశాడు. బెలూన్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి, భారీగా నష్టాలు రావడానికి జై కారణమని ఆరోపించిన నందకుమార్.. మంచి మనసున్న అంజలిని చెడగొట్టేశాడని వెల్లడించాడు. కోలీవుడ్ లో అంజలికి ఆఫర్లు తగ్గి రోడ్డున పడటానికి అసలు కారణం జై అని ఆరోపించాడు. అంతేకాదు ఈ సందర్భంగా కొడైకెనాల్ లో జరిగిన ఓ ఘటనను బయట పెట్టాడు.

 

బెలూన్ షూటింగ్ టైమ్ లో కొడైకెనాల్ లో హీరోహీరోయిన్లకు రెండు ఫైవ్ స్టార్ రూమ్స్ బుక్ చేశారట. కానీ జై మాత్రం అంజలి గదిలోనే ఉన్నాడట. తన గది అస్సలు వాడలేదట. రోజుకు 12వేల రూపాయల రెంట్ ఉన్న ఆ గదిని ఖాళీ చేద్దామని చెప్పినప్పటికి జై ససేమిరా అన్నాడట. అంతేకాకుండా.. కావాలనే షూటింగ్స్ ఎగ్గొట్టేవాడని, అంజలి చేత కూడా రకరకాల సాకులు చెప్పించి షూటింగ్స్ కాన్సిల్ చేయించాడని నందకుమార్ ఆరోపించారు. ఇలా అంజలి కెరీర్ తో జై ఆడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అంజలి-జై కలిసి ఉండడం లేదు. ఆమె పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది. తమిళ్ లో 5, తెలుగులో 2 సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అనుష్క తో కలిసి అంజలి నటించిన 'నిశ్శబ్దం' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే కూడా నటిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: